AP News: గుడివాడ క్యాసినో ఘటనపై గవర్నర్కు తెదేపా ఫిర్యాదు
గుడివాడలో క్యాసినో జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ నిజనిర్థారణ కమిటీ అక్కడ పర్యటించింది.
విజయవాడ: గుడివాడలో క్యాసినో జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ నిజనిర్థారణ కమిటీ అక్కడ పర్యటించింది. అనంతరం నివేదిక రూపొందించి తెదేపా అధినేత చంద్రబాబుకు అందజేసింది. దీనికి సంబంధించి కమిటీలోని సభ్యులు ఇవాళ రాజ్భవన్లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారనడానికి సంబంధించి కరప్రతాలు, వీడియో సాక్ష్యాలతో పాటు నివేదికను ఆయనకు అందజేశారు. క్యాసినోలో నృత్యం చేసిన 13 మంది యువతులు ఈ నెల 17న విజయవాడ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకి, అక్కడి నుంచి గోవాకి వెళ్లినట్టు ప్యాసింజర్ లిస్టు.. వారికి టికెట్లు బుక్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్లు సేకరించి సమగ్ర నివేదిక గవర్నర్కు అందజేశారు.
గుడివాడ పర్యటన సందర్భంగా తమపై జరిగిన దాడి, పోలీసుల వ్యవహారంపైనా ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి కొడాలి నానీని మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహణపై విచారణ కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను గవర్నర్కు ఇచ్చారు. గవర్నర్ను కలిసిన వారిలో మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజా, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమా తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM