Andhra News: విజయవాడ ధర్నాచౌక్లో ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్
రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్ చేయాలంటూ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
విజయవాడ: రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావును రీకాల్ చేయాలంటూ విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం విజయవాడ ధర్నా చౌక్ నుంచి చలో రాజ్భవన్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ధర్నాచౌక్ వద్దకు చేరుకొని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
153 మందిని పరీక్షలకు అనుమతించకుండా వీసీ ఆనందరావు వారి జీవితాలను నాశనం చేశారని విద్యార్థి, యువజన సంఘ నాయకులు ఆరోపించారు. అనంతరం విద్యార్థి, యువజన సంఘాల నేతలు, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. మరోవైపు రాజ్భవన్, ధర్నాచౌక్లో సీపీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు