Ayyanna patrudu: అన్ని అనుమతులు తీసుకునే నిర్మించాం: అయ్యన్న కుమారుడు రాజేశ్
మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం...
నర్సీపట్నం: మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంపై ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో మున్సిపల్ సిబ్బంది తీరును అయ్యన్నపాత్రుడు రెండో కుమారుడు చింతకాయల రాజేశ్ ఖండించారు. మున్సిపల్ కమిషనర్ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే నిర్మించామని చెప్పారు. ల్యాండ్ పర్మిషన్ ఇచ్చాకే కట్టామని రాజేశ్ తెలిపారు. న్యాయంగా ఇల్లు కట్టుకున్నామని.. ఇలా ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్? అని ఆయన నిలదీశారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని రాజేశ్ ఆరోపించారు. అధికారులు మాత్రం ఆక్రమణలో ఉన్నందునే కూల్చివేశామని చెబుతున్నారు.
మరోవైపు అయ్యన్న ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన కుమారుడు రాజేశ్ను అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు, అధికారులతో కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
పంట కాల్వను ఆక్రమించి నిర్మించారంటూ నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను అర్ధరాత్రి మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో రెండు సెంట్లు ఆక్రమించారంటూ మున్సిపల్ కమిషనర్ పేరిట ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా