గుంటూరులో ‘అన్న క్యాంటీన్‌’ ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ

వైకాపా పాలకులు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

Published : 29 May 2022 13:50 IST

గుంటూరు: వైకాపా పాలకులు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గుంటూరులోని జేకేసీ రోడ్డులో తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్‌’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లోనూ తిరుగుబాటు వస్తోందని చెప్పారు. మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వంపై ఉద్యమించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని