AP New Districts: మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలి: లంకా దినకర్‌

ఏపీ ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం జిల్లాల పెంపు అంటోందని.. అలా అయితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురంలను జిల్లాలుగా చేయాలని

Updated : 27 Jan 2022 11:40 IST

విజయవాడ: ఏపీ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పెంపు అంటోందని.. అలా అయితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురంలను జిల్లాలుగా చేయాలని భాజపా నేత లంకా దినకర్‌ డిమాండ్‌ చేశారు. అస్పష్టమైన విభజనతో పాలన వికేంద్రీకరణ సాధ్యం కాదని చెప్పారు. 

ఒంగోలు కేంద్రంగా కొండపి, కందుకూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలతో నూతన ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేయడం ఉత్తమమైన కూర్పు అవుతుందని దినకర్‌ సూచించారు. చాలా కాలంగా ఆ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్న పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని