Andhra News: నా వయసు 72.. నా స్ఫూర్తి మాత్రం 27..: చంద్రబాబు
వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని.. ఇక ఎవరూ ఆపలేరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడపలో పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. బాదుడే బాదుడుతో వైకాపా...
కడప: వైకాపా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసిందని.. ఇక ఎవరూ ఆపలేరని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడపలో పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. బాదుడే బాదుడుతో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఒంగోలులోని స్టేడియం ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘‘కడపలో అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? అధిక అప్పులతో జగన్ రాష్ట్ర పరువును తీశారు. సీఎం జగన్ చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల ఏమైంది? గుంటూరు మహిళ వెంకాయమ్మ ఉన్నదే చెప్పింది. నిజాలు చెబితే వెంకాయమ్మ ఇంటిపై దాడి చేశారు. సీబీఐ కేసుల్లో వాదించిన వారికి, తనతో కేసుల్లో ఉన్నవారికి జగన్ రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చారు. ఏపీలో రాజ్యసభ సీట్లు ఇచ్చేందుకు ఆయనకు సమర్థులు కనిపించలేదా? పులివెందులలో బస్టాండ్ కట్టలేని వారు 3 రాజధానులు కడతారా? పులివెందులలో రైతులకు ఎందుకు బీమా రావడం లేదో సీఎం చెప్పాలి. బైకుపై మృతదేహాన్ని తరలిస్తే సీఎం కనీసం స్పందించకపోవడం బాధాకరం. అత్యాచార బాధితులను పరామర్శించలేదు. సమస్యలు చెప్పే వారిపై కేసులు పెడుతున్నారు. వైకాపా పాలనలో పేదల జీవితాలు చితికిపోయాయి. జగన్ చేసేది ఉత్తుత్తి బటన్ నొక్కుళ్లే. రాజ్యసభ సీట్లను జగన్ గంపగుత్తగా అమ్ముకున్నారు. జగన్ పరిపాలన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయింది. ఒక్కరికీ ఉద్యోగం రాలేదు.. జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఈ ప్రభుత్వం కడప జిల్లాకు ఒక్క పరిశ్రమ తెచ్చిందా? రికార్డులు మార్చేసి బద్వేల్ ఎమ్మెల్సీ 800 ఎకరాలు కొట్టేశారు. ఈ పోరాటం నా కోసం కాదు.. బలహీన వర్గాల బాగు కోసం. నా వయసు 72.. నా స్ఫూర్తి మాత్రం 27.. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో యువతకు ప్రాధాన్యం ఇస్తాం. కడప నుంచే తెదేపా జైత్రయాత్ర మొదలవుతుంది’’ అని చంద్రబాబు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?