Andhra News: సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా: చంద్రబాబు

మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కొత్తగా రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రజలు ఒకసారి పరిశీలించాలన్నారు.

Updated : 20 May 2022 15:55 IST

అనంతపురం: మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కొత్తగా రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రజలు ఒకసారి పరిశీలించాలన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ‘‘అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. సంక్షోభాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆశ ప్రజలందరిలో ఉంది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా. తెదేపా హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో పరిశ్రమలు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమలతో అనేక మందికి ఉపాధి కల్పించాం. వైకాపా పాలనలో పరిశ్రమల్లేవు.. యువతకు ఉద్యోగాలు లేవు. వైకాపా నేతల రౌడీయిజం చూసి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయి. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు’’ అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని