AP News: ఉద్యోగుల సమస్యలపై తెగే వరకూ లాగొద్దు: సీపీఐ నారాయణ

ఏపీలో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలుకుతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు.

Updated : 22 Jan 2022 12:21 IST

అమరావతి: ఏపీలో పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలుకుతున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాల ఐక్య కార్యచరణను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలకు అంటకాగాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయ పార్టీలను అంటరానితనంగా కూడా పరిగణించకూడదని నారాయణ అభిప్రాయపడ్డారు.

ఉద్యోగులను ఎవరు స్వార్థంతో వినియోగించుకుంటున్నారో ఆలోచించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లకు దిగి రావాలని ఆశిస్తున్నట్లు నారాయణ చెప్పారు. తెగే వరకూ లాగకుండా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని