AP News: ఆరుగురు వస్తామని.. వందలాది మంది వచ్చారు: డీఐజీ మోహన్రావు
కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారం, ఉద్రిక్త పరిస్థితులపై డీఐజీ మోహన్రావు స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారం, ఉద్రిక్త పరిస్థితులపై డీఐజీ మోహన్రావు స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గుడివాడలో ఉద్రిక్త వాతావరణం సృష్టించడం వల్లే తెదేపా నేతలను అరెస్టు చేసినట్టు చెప్పారు. ‘‘నిజనిర్ధరణ కమిటీ నుంచి ఆరుగురు తెదేపా నేతలే వస్తామని చెప్పి వందలాది మంది వచ్చారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందా అనేదాన్ని కూడా పరిశీలిస్తున్నాం. గృహనిర్బంధం, అరెస్టు చేయాలని తెదేపా నేతలు ఎందుకు కోరారు. ఎక్కువ మంది వచ్చి రెచ్చగొట్టేలా మాట్లాడి ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ముందస్తు ప్రణాళిక, దురుద్దేశంతోనే వచ్చినట్టు భావిస్తున్నాం. రాజకీయాల కోసం శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని కోరుతున్నాం. గుడివాడలో కావాలని మేం ఎవరినీ అడ్డుకోలేదు. శాంతిభద్రతల్లో భాగంగానే కొందరిని నియంత్రించాం. రెచ్చగొట్టేలా మాట్లాడటం, కేకలు వేయడం తప్పు. ఏం జరిగింది, ఎవరు రెచ్చగొట్టారనేది దర్యాప్తు చేస్తున్నాం. గుడివాడ ఘటనపై ఎస్పీ నేతృత్వంలో వేసిన కమిటీ విచారణ జరుపుతోంది’’ అని డీఐజీ మోహన్ రావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.