Andhra News: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీ కడితే ఊరుకోం: వైకాపా నాయకులు

గుంటూరు జిల్లా తెనాలిలో నటుడు జూనియర్‌ ఎన్టీఆర్ అభిమానులు, వైకాపా నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా 14వ వార్డులో అభిమానులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

Published : 20 May 2022 19:27 IST

తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో నటుడు జూనియర్‌ ఎన్టీఆర్ అభిమానులు, వైకాపా నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా 14వ వార్డులో అభిమానులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైకాపా మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌ వార్డు కావడంతో వివాదం తలెత్తింది. ఫ్లెక్సీ కట్టేందుకు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ గుంటూరు కోటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా తమ వార్డులో ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు కట్టట్లేదని.. ఇప్పుడెందుకు కడుతున్నారని అభిమానులను ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు కడితే ఊరుకోబోమని వైకాపా నాయకులు అభిమానులను హెచ్చరించారు. వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్‌ ఫ్లెక్సీలు పెడితే లేని అభ్యంతరం తమ అభిమాన నటుడి ఫ్లెక్సీలు పెడితే తప్పేంటని వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని