Krishanpatnam: ఆనందయ్య మందుపై తొలిదశ అధ్యయనం పూర్తి

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్‌) తొలి దశ అధ్యయనం...

Updated : 26 May 2021 18:32 IST

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుపై జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్‌) తొలి దశ అధ్యయనం పూర్తయింది. సీసీఆర్‌ఏఎస్‌ ఆదేశాల మేరకు విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఎస్వీ ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా అధ్యయనం చేశాయి. 

ఆయా సంస్థల ఆయుర్వేద వైద్యులు రెస్ట్రోపెక్టివ్‌ స్టడీని పూర్తిచేశారు. ఆనందయ్య మందు తీసుకున్న 570 మందితో వారు మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సీసీఆర్‌ఏఎస్‌కు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. రోగుల ఫీడ్‌ బ్యాక్‌ వివరాలపై ఆయుర్వేద వైద్యుల స్పందించలేదు. రేపటిలోపు సీసీఆర్‌ఏఎస్‌ తదుపరి ఆదేశాలు ఇస్తుందని అధికారులు తెలిపారు. సీసీఆర్‌ఏఎస్‌ అనుమతితో తర్వాత దశలో టాక్సిక్‌ స్టడీ, జంతువులపై పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని