Andhra News: మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూత

మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత గారపాటి సాంబశివరావు(75) కన్నుమూశారు.

Updated : 02 Feb 2022 11:49 IST

పెదపాడు: మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత గారపాటి సాంబశివరావు(75) కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస వదిలారు. కొన్నేళ్లుగా సాంబశివరావు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సాంబశివరావు మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని చెప్పారు. సాంబశివరావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు సాంబశివరావు మృతిపట్ల దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సంతాపం తెలిపారు. ఆయన పార్థివదేహం వద్ద ఎమ్మెల్యే నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని