గురుకులాల్లో హాజరు.. అరకొర
సంక్రాంతి సెలవుల అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 2,026 మంది ఆయా గురుకులాలకు వచ్చారు. 2021-22 విద్యా ఏడాదిలో 18 గురుకులాల్లో మొత్తం 9,176 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
వినుకొండ గురుకులంలో విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న సిబ్బంది
గుంటూరు, న్యూస్టుడే సంక్రాంతి సెలవుల అనంతరం రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు సోమవారం పునః ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 2,026 మంది ఆయా గురుకులాలకు వచ్చారు. 2021-22 విద్యా ఏడాదిలో 18 గురుకులాల్లో మొత్తం 9,176 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. సంక్రాంతి సెలవుల అనంతరం గురుకులాల్లో తరగతులకు హాజరైన వారి సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. ఒమిక్రాన్ కేసులు విస్తరిస్తుండటంతో పిల్లల్ని గురుకులాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తుందనే ప్రచారం జరగడంతో వేచి చూసే ధోరణిలో పలువురు తల్లిదండ్రులు ఉన్నారు. ఆయా గురుకులాల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను తరగతులకు తీసుకురావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావడం లేదు. కొవిడ్ మూడో దశలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువ నమోదు అవుతుండడంతో భయాందోళన చెందుతున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినపుడే విద్యార్థులను పిలిపించాలనే భావనలో ఉన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత కూడా కొందరు గురుకులాలకు వస్తున్నారని సిబ్బంది తెలిపారు. గురుకులాల్లో భౌతిక దూరం పాటించేలా చూడడం, మాస్కులు పెట్టుకోవడం, శానిటేషన్ రాసుకునేలా చూడడం ఉపాధ్యాయులకు సవాల్గా మారింది. చిన్న తరగతుల విద్యార్థులకు కరోనా గురించి అవగాహన లేకపోవడంతో కొవిడ్ నిబంధనలు పాటించని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధించడం.. స్టడీ అవర్స్లో జాగ్రత్తలు తీసుకోవడం సమస్యగా మారింది. ఎక్కడ కొవిడ్ బారిన పడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. కొవిడ్-1, 2 దశల్లో కొందరు ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొని ఉండటమే వారి భయానికి కారణంగా మారింది.
విద్యాలయాల వారీగా..
కారంపూడిలో 429 మంది విద్యార్థులకు 33 మంది విద్యార్థులు హాజరయ్యారు. రామకృష్ణాపురం 651-70, అచ్చంపేటలో 537-142, చుండూరులో 449-65, వి.పి.సౌత్లో 737-33, బాపట్లలో 647-131, వినుకొండలో 473-418, నిజాంపట్నంలో 430-29, రేపల్లెలో 614-22, ఉప్పలపాడులో 621-100, అమరావతిలో 777-201, కాకుమానులో 406-118, తాడికొండలో 373-88, గురజాలలో 413-125, సత్తెనపల్లిలో 369-45, అడవితక్కెళ్లపాడులో 665-146, యడ్లపాడులో 365-181, నరసాయపాలెంలో 220 మందికి 79 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. -
జీవితాన్ని కలరా‘జే’సింది..
[ 19-04-2024]
రేపల్లెకు చెందిన మధు ప్రభుత్వ మద్యం తాగి పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. చేతివృత్తి చేసుకుంటూ భార్య ఇద్దరు పిల్లలను పోషించుకునే అతను మద్యం తాగేవాడు. -
సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
[ 19-04-2024]
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. -
ఆరోగ్యం చిదిమేసి.. బతుకుల్ని బుగ్గి‘జే’సి..
[ 19-04-2024]
మద్యపాన నిషేధం చేస్తామని జగన్మోహన్రెడ్డి ఓట్లు దండుకుని తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారానికి తెరతీసింది. నాసిరకం మద్యం పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. -
అండ నేనన్నావు.. గుదిబండలా మార్చావు..
[ 19-04-2024]
జిల్లాలో వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్నవి చాలా వరకు మూతపడ్డాయి. పత్తి ఆధారిత పరిశ్రమలైన జిన్నింగ్ పూర్తిగా ఎత్తేయగా.. స్పిన్నింగ్ మిల్లులు అదే దిశగా నడుస్తున్నాయి. -
యువనేతపై ఉప్పొంగిన అభిమానం
[ 19-04-2024]
లోకేశ్ తరఫున నామినేషన్ పత్రాల సమర్పణ సందర్భంగా గురువారం మంగళగిరిలో జనసేన, భాజపా, తెదేపా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగానికి ఆటంకాలు
[ 19-04-2024]
వైకాపా ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇదే అదనుగా పోలింగ్ విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోకుండా వ్యూహాత్మకంగా ఉన్నతాధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
కోన ఆస్తుల విలువ రూ.24.20 కోట్లు
[ 19-04-2024]
బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన కుటుంబ ఆస్తుల విలువను రూ.24.20 కోట్లుగా గురువారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. -
నలిగిపోతున్న నాలుగో సింహం
[ 19-04-2024]
ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీసులు పగలు, రాత్రి కష్టపడుతుంటారు. శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో సంఘ విద్రోహశక్తుల చేతిలో ప్రాణత్యాగాలకు సైతం వెనకాడరు. -
కర్షకుల కష్టాలు కనిపించవా..?
[ 19-04-2024]
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. -
వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం
[ 19-04-2024]
‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు -
‘అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం’
[ 19-04-2024]
అసమర్థ, అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. కొల్లిపరలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ వైకాపా పాలకులకు పోలవరం పట్టలేదు, -
ఎప్పటికి తొలగిస్తారో!
[ 19-04-2024]
పట్టణ పరిధి జీబీసీ రహదారిలో విద్యుత్తు స్తంభానికి సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే రోశయ్య, వైకాపా నేతల ఫొటోలతో కూడిన బోర్డు ఉంది. -
మొదలైన నామినేషన్ల పర్వం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో నెల రోజులుగా పలు విధాలుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టిన పార్టీలు ఇప్పటికే నామినేషన్ పత్రాలు పూర్తి చేసి మంచి ముహూర్తం కోసం వేచి ఉన్నారు. -
ఫోన్పే చేయమన్నాడు.. అదృశ్యమయ్యాడు!
[ 19-04-2024]
అద్దంకి పురపాలక కార్యాలయం వద్ద మంచినీటి కుళాయి రుసుం చెల్లించేందుకు వచ్చిన వృద్ధుడ్ని ఓ ఘరానా దొంగ మోసగించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం పురపాలక పన్నుల విభాగం వద్ద జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి