ఏడు గంటలు నరకం
నాతవలస వద్ద జరిగిన ఘటన కలచివేసింది. ప్రమాద సమయంలో బస్సులో చిన్నారులు, వృద్ధులు కలిపి మరో 41 మంది ఉన్నారు. వీరంతా బయటకు రాలేక.. బిక్కుబిక్కుమంటూ ఏడు గంటల పాటు అందులోనే ఉండాల్సి వచ్చింది. తెల్లవారింది.. ఏ ఒక్కరైనా వచ్చి తమను బయటకు తీస్తారేమోనని
ఆగిన లారీని ఢీకొన్న యాత్రికుల బస్సు
అందులోనే వృద్ధులు, పిల్లలు
9 మందికి గాయాలు
నాతవలస టోల్గేట్ వద్ద ప్రమాదానికి గురైన బస్సు
భోగాపురం, న్యూస్టుడే నాతవలస వద్ద జరిగిన ఘటన కలచివేసింది. ప్రమాద సమయంలో బస్సులో చిన్నారులు, వృద్ధులు కలిపి మరో 41 మంది ఉన్నారు. వీరంతా బయటకు రాలేక.. బిక్కుబిక్కుమంటూ ఏడు గంటల పాటు అందులోనే ఉండాల్సి వచ్చింది. తెల్లవారింది.. ఏ ఒక్కరైనా వచ్చి తమను బయటకు తీస్తారేమోనని ఆశతో ఎదురు చూశారు. ఉదయం 7, 8, 9 గంటలు అవుతున్నా.. ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. ఈ విషయం తెలుసుకున్న ఈనాడు-ఈటీవీ బృందం అక్కడకు చేరుకుంది. అప్పటికే సమయం 11 కావస్తోంది. చిన్న పిల్లలు కిటికీల్లోంచి కిందకు దిగి దగ్గర్లో ఉన్న దుకాణానికి వెళ్లి బిస్కెట్లు తెచ్చి వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన పరిస్థితి కనిపించింది.
బాధితులకు శీతల పానీయాలు, బిస్కెట్లు అందిస్తున్న పోలీసులు
సమయం: శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలు
ఏం జరిగింది: డెంకాడ మండలం నాతవలస జాతీయ రహదారిపై ప్రమాదం.
ఎలా: మహారాష్ట్ర నుంచి తిరుపతి వెళ్తున్న యాత్రికుల బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఏమైంది: ఈ ఘటనలో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తలుపు లాక్ కావడంతో వారితో పాటు మిగిలిన వారు బయటకు రాలేకపోయారు. ఏడు గంటల పాటు అందులోనే ఉండిపోయారు. కొందరు వృద్ధులు బస్సులోనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చింది.
‘ఈనాడు-ఈటీవీ’ చొరవతో స్పందించిన ఎస్పీ
విషయాన్ని ‘ఈనాడు-ఈటీవీ’ బృందం ఎస్పీ దీపిక ఎం.పాటిల్కు చరవాణిలో తెలపగా ఆమె వెంటనే స్పందించారు. 15 నిమిషాల్లో సంఘటనా స్థలానికి మూడు హైవే మొబైల్ వాహనాలతో పాటు పూసపాటిరేగ, డెంకాడ మండలాల ఎస్సైలు సిబ్బందితో వచ్చారు. సమీప టోల్గేట్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బస్సులో యాత్రికులు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయారు. ఎస్సై పద్మావతి సూచనలతో కానిస్టేబుల్ త్రినాథ్ బస్సు అత్యవసర ద్వారాన్ని తెరచి ఒక్కొక్కరిని కిందకు దింపారు. వారికి అప్పటికే తీసుకొచ్చిన శీతల పానీయాలు, బిస్కెట్లు అందించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశామని, వీరంతా మహారాష్ట్రకు చెందిన వారన్నారు. వీరు పూరీ, కోల్కతా చూసి రామేశ్వరం, తిరుమల దర్శనానికి వెళ్తున్నట్లు తెలిపారు. యాత్రికులను సురక్షితంగా తీసుకెళ్లేందుకు వాహనం మాట్లాడుతున్నామని చెప్పారు. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించామన్నారు.
లోపల నానాయాతన పడుతున్న ప్రయాణికులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభ్యర్థుల ఖర్చు వారి ఖాతాల్లోనే జమ
[ 20-04-2024]
జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వ్యయ పరిశీలకులు ప్రభాకర్ ప్రకాష్ రాజన్, ఆనందకుమార్, ఆకాష్దీప్ ఆదేశించారు. -
ఎన్నికల హోరు.. నామినేషన్ల జోరు
[ 20-04-2024]
జిల్లాలో రెండో రోజు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. శుక్రవారం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గానికి 6, అసెంబ్లీ స్థానాలకు 33 నామినేషన్లు దాఖలయ్యాయి. -
కదిలిన పసుపు దండు
[ 20-04-2024]
జిల్లా కేంద్రం శుక్రవారం పసుపుమయమైంది. తెదేపా నుంచి ఎంపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్ వేసేందుకు అశోక్ బంగ్లాకు కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. -
ఎస్ కోటలో 22న చంద్రబాబు పర్యటన
[ 20-04-2024]
శృంగవరపుకోట పట్టణంలో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన 22వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఖరారు అయింది. ముందుగా 21వ తేదీన పర్యటన ఉంటుందని సమాచారం వచ్చింది. -
బొబ్బిలిలో మార్పు మొదలైంది
[ 20-04-2024]
బొబ్బిలి నియోజకవర్గంలో తెదేపాలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. వైకాపా నుంచి తెదేపాలోకి పలువురు వాలంటీర్లు, ముఖ్య నేతలు చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు స్వగ్రామం పక్కి నుంచి పలువురు వైకాపా నాయకులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. -
అయిదేళ్లలో బొత్స సోదరుల ఆస్తులు రెట్టింపు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు అధిక సంఖ్యలోనే దాఖలయ్యాయి. శృంగవరపుకోట అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అఫిడవిట్ దాఖలు చేయలేదు. -
వాహనాల్లో కుక్కేశారు.. ట్రాఫిక్లో ఉంచేశారు
[ 20-04-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పర్వం సాగింది. ఈక్రమంలో వైకాపా అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలతో పాటు కూలీలను తరలించారు. -
తరలింపు వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
[ 20-04-2024]
నామినేషన్ ఘట్టానికి వైకాపా కార్యకర్తలను తరలించిన ఆటో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు రాజాన దిలీప్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. -
ఉల్లంఘనలు కనిపించడం లేదా?
[ 20-04-2024]
పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగారావు ఏం చేసినా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. -
ప్రజలకు జగనన్న షాక్
[ 20-04-2024]
తాము అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామని నాడు ప్రతిపక్ష నేతగా బాకా ఊదారు సీఎం జగన్. బాదుడే.. బాదుడు అంటూ అప్పటి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేశారు. దీంతో నిజమని నమ్మేశారు కొందరు ప్రజలు. -
చందనోత్సవ వైఫల్యాలపై నివేదిక ఏదీ..?: అశోక్
[ 20-04-2024]
సింహాచలం దేవస్థానంలో గతేడాది చందనోత్సవ సమయంలో జరిగిన వైఫల్యాలపై చేపట్టిన విచారణ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదని ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అన్నారు. -
ఉప్పొంగిన అభిమానం
[ 20-04-2024]
రాజాం పట్టణం జనసంద్రమైంది. కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ నామినేషన్ సందర్భంగా మండుటెండను సైతం లెక్క చేయకుండా వివిధ మండలాల నుంచి చేరుకున్న వేలాది మంది గంటల కొద్దీ ర్యాలీలో పాల్గొన్నారు. -
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్
[ 20-04-2024]
ప్రజావ్యతిరేక పాలకుడు జగన్కు రోజులు దగ్గర పడ్డాయని, వైకాపా వచ్చిన తర్వాత దోపిడీ ఎక్కువైందని చీపురుపల్లి ఎన్డీయే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్