విధినే ఎదిరించే.. విజయ శిఖరమే తలవంచే!
ఒకప్పుడు కటిక పేదరికం. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడిన రోజులెన్నో. కానీ, ఇప్పుడు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నత హోదాలో ఉన్నారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయికి చేరిన జి. హరిప్రసాదరాజు జీవన ప్రస్థానంలో ప్రతి మలుపూ ఆసక్తికరమే.
వెంటాడిన పేదరికం
అయినా.. సివిల్స్ సాధనే ధ్యేయంగా కృషి
మేఘాలయ అదనపు డీజీపీ జి.హెచ్.పి.రాజు ప్రస్థానం
ఈనాడు, విశాఖపట్నం
ఒకప్పుడు కటిక పేదరికం. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడిన రోజులెన్నో. కానీ, ఇప్పుడు మేఘాలయ రాష్ట్రంలో ఉన్నత హోదాలో ఉన్నారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయికి చేరిన జి. హరిప్రసాదరాజు జీవన ప్రస్థానంలో ప్రతి మలుపూ ఆసక్తికరమే. అవేంటో.. విశాఖ వచ్చిన ఆయన మాటల్లోనే.
కారణం 1...
నాకు చదువులో బొటాబొటీ మార్కులే వచ్చేవి. ఇంటర్లో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించా. ఆ రోజుల్లో బీఎస్సీలో సీటురావడం కూడా కష్టమైంది.
నేను పెద్దగా చదవనని చాలా మంది హేళన చేసేవారు. ఓ మిత్రుడు సివిల్స్ వైపు దృష్టిపెడితే ఎలా ఉంటుందో చెప్పారో.. ఆ రోజే ఆ దిశగా నా ఆలోచన ఆరంభమయింది.
కారణం 2...
ఎన్నో కష్టాలు దాటుకొని డీఎస్పీగా ఎంపికైన తరువాత క్షేత్రస్థాయి శిక్షణ నిమిత్తం విజయవాడ వెళ్లా.
ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఒక ఉన్నతాధికారి నాతోపాటు వచ్చిన ఇద్దరు శిక్షణ ఐ.పి.ఎస్.లను భోజనానికి పిలిచారు. నన్ను మాత్రం పిలవలేదు.
నాకు తలకొట్టేసినట్లైంది. ఆ రోజే సివిల్స్లో ర్యాంకు సాధించాలన్న పట్టుదల మరింత పెరిగింది.
ఉద్యోగాన్ని కాదనుకున్నా..
పీజీ పూర్తికాగానే ప్రభుత్వ ‘అటామిక్ మినరల్స్’ డివిజన్లో ఉద్యోగమిస్తామని పిలిచి.. ఇంటర్వ్యూలో నా లక్ష్యం ఏమిటని అడగ్గా... సివిల్స్కు సాధన చేస్తున్నానని చెప్ఫా ‘ఉద్యోగం తప్పకుండా ఇస్తాం. కానీ, సివిల్స్ సాధనకు అవకాశం ఉండదు. క్యాంపులకు వెళ్లాల్సి ఉంటుంది. నీ లక్ష్యాన్ని మరచిపోవాలి. ఆలోచించుకుని చెప్పు’ అన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాకు ఆ ఉద్యోగం చాలా అవసరం. కానీ సివిల్స్ లక్ష్యం గుర్తొచ్చి ఉద్యోగం వద్దని చెప్ఫా
అలా సీటొచ్చింది...
ఇంటర్ తరువాత చాలా కాలేజీలకు దరఖాస్తు చేశా. గుంటూరు హిందూ కళాశాలలో బీఎస్సీ జియాలజీలో సీటు వచ్చింది. అప్పట్లో ఆ కోర్సు కొత్తగా పెట్టారు. సీట్లు మిగిలి నాకు అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో నా మిత్రుడు మన్నవ నాగేశ్వరరావు సివిల్స్లో ర్యాంకు సాధిస్తే జీవితానికి తిరుగుండదని చెప్పేవారు. డిగ్రీలో సీటు రావడమే కష్టమైన నాకు సివిల్స్ గురించి ఆలోచించడం అతిశయోక్తిగా అనిపించింది. కానీ, నన్ను హేళన చేసిన వారికి నేనేంటో నిరూపించాలన్న పట్టుదల పెరిగింది. డిగ్రీలో 80.8 శాతం మార్కులు సాధించా.
అలా.. ఏయూలో...
డిగ్రీ తరువాత ఏయూ జియాలజీ విభాగంలో ఎమ్మెస్సీ (టెక్) పూర్తి చేశా. అత్యుత్తమ మార్కులతో బంగారుపతకం కూడా సాధించా. పెద్దన్నయ్య ఎండీ, చిన్నన్నయ్య ఎంటెక్ చేస్తూ వారికి వచ్చే ఉపకారవేతనం నుంచి కొంత నాకు పంపేవారు. మిత్రులు కూడా ఆర్థిక సాయం చేస్తుండేవారు. అలా ఆర్థికంగా అండగా నిలిచారు.
అస్వస్థత నేపథ్యంలో..
డీఎస్పీగా శిక్షణ పొందుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యా. ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో సివిల్స్కు సాధన చేశా. జాతీయస్థాయిలో 65వ ర్యాంకు వచ్చింది. ఐ.ఎ.ఎస్. వచ్చే అవకాశం ఉన్నా ఐ.పి.ఎస్.నే ఎంచుకున్నా. అసోం, మేఘాలయ కేడర్ వచ్చింది. 1993 బ్యాచ్ ఐ.పి.ఎస్.గా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి, పదోన్నతులు పొంది ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్నా. ప్రజలకు మరింతగా సేవ చేయాలన్న ఉద్దేశంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతితో డిప్యుటేషన్పై పశుసంవర్థక, కార్మిక, సహకారశాఖల ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నా. నా భార్య అనిత స్వస్థలం విశాఖే. నా కుటుంబసభ్యులతోపాటు ఆమె ఇచ్చిన సహకారం మరువలేను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్