యువతి ఆత్మహత్య
ఉరి వేసుకొని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లు పెంటపాడు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవళ్ల సత్యవతి, ఆమె కుమార్తె మేరీ ప్రసన్నకుమారి(29) పెంటపాడు మండలం అలంపురంలోని
మేరీ ప్రసన్నకుమారి (పాత చిత్రం)
పెంటపాడు, న్యూస్టుడే : ఉరి వేసుకొని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లు పెంటపాడు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవళ్ల సత్యవతి, ఆమె కుమార్తె మేరీ ప్రసన్నకుమారి(29) పెంటపాడు మండలం అలంపురంలోని జాతీయ రహదారికి సమీపంలో నివాసం ఉంటున్నారు. మేరీ ప్రసన్నకుమారి ఈ నెల 22న రాత్రి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలైనా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు, స్థానికులు తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి మేరి ప్రసన్నకుమారి పంకాకు వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు భావించి ఆమెను కిందకు దించారు. కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం పెంటపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా