AP News: నేడు ‘ఈబీసీ నేస్తం’ ప్రారంభం

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లపాటు అందించనున్నారు

Updated : 25 Jan 2022 03:47 IST

3.93 లక్షల మంది మహిళలకు లబ్ధి
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏటా రూ.15 వేల చొప్పున మూడేళ్లపాటు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతోపాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 3.93 లక్షల మంది మహిళలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరి ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్‌ నొక్కి ముఖ్యమంత్రి జమ చేయనున్నారు. మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ఈబీసీలోని పేదల మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని