హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

‘జిల్లా కేంద్రాల విషయంలో రాజకీయం చేయొద్దు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి’ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

Updated : 28 Jan 2022 04:07 IST

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

హిందూపురంఅర్బన్‌, న్యూస్‌టుడే: ‘జిల్లా కేంద్రాల విషయంలో రాజకీయం చేయొద్దు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి’ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండు చేశారు. ఈమేరకు గురువారం ఆయన వీడియో సందేశం పంపించారు. ‘’రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిన విషయం. హామీ ఇచ్చినట్లుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించాలి. హిందూపురం వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి ఉంది. పట్టణాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించి శ్రీసత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని