Vijayawada: ఆప్యాయత కరవై.. ఆవేదన బరువై..
ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ఆమెకు భర్త నుంచి తాను కోరుకున్న ఆప్యాయత దొరకలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా అతనిలో మార్పు రాలేదు. దీనిని భరించలేక గతంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది.
పిల్లలకు విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకున్న వివాహిత
కృష్ణలంక, న్యూస్టుడే: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ఆమెకు భర్త నుంచి తాను కోరుకున్న ఆప్యాయత దొరకలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా అతనిలో మార్పు రాలేదు. దీనిని భరించలేక గతంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. తీవ్ర మనస్తాపంతో జీవనం సాగిస్తున్న ఆ మహిళ ఇక తట్టుకోలేక పిల్లలకు విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లారీడ్రైవర్గా పనిచేసే చలమలశెట్టి గోపాలకృష్ణకు పాయకాపురానికి చెందిన చందన లక్ష్మి(27)తో 2012లో వివాహమైంది. వారికి నాగమణికంఠ(9), జయహర్ష(7) ఇద్దరు పిల్లలు. ఈ కుటుంబం కృష్ణలంక గీతానగర్కరకట్ట సమీపంలో ఉంటున్నారు. లారీడ్రైవర్గా పనిచేసే గోపాలకృష్ణ నిరంతరం విధుల్లో ఉండడం, మద్యం తాగడం తప్ప భార్య, పిల్లల పట్ల పెద్దగా ఆసక్తిని ప్రదర్శించే వాడు కాదు. అతని ప్రవర్తనతో అసంతృప్తి చెందిన చందన లక్ష్మి సుమారు నాలుగేళ కిందట ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాపాయం తప్పింది. భర్త ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో పాటు, బంధువుల నుంచి కూడా ఓదార్పు లభించకపోవడం ఆమె ఒంటరితనానికి లోనై మనస్తాపం చెందింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం పిల్లలతో పుట్టింటికి వెళ్లిన చందనలక్ష్మి మధ్యాహ్నం 2గంటలకు ఇంటికి తిరిగొచ్చింది. వెంట తెచ్చుకున్న ద్రాక్ష జ్యూస్లో మొక్కల పెంపకానికి వాడే గుళికల మందును కలిపి ముందు తాను తాగి, అనంతరం పిల్లలతో తాగించింది. రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న భర్త తలుపుకొట్టగా ఎంతసేపటికి తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో పగలగొట్టి లోపలకు వెళ్లాడు. బెడ్రూమ్లోని మంచంపై భార్యా, పిల్లలు నోట్లోంచి నురుగ కారుతున్న స్థితిలో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, ముగ్గురూ మృతిచెందినట్లుగా నిర్ధారించారు. చందనలక్ష్మి రాసిన లేఖ, గుళికలమందు ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నారు. వివాహిత మనస్తాపానికి లోనై మృతి చెందినట్లుగా ప్రాథ]మికంగా నిర్ధారించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఎంవీ దుర్గారావు తెలిపారు.
నాగమణికంఠ, జయహర్ష (పాతచిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు