పల్నాడులో లోకేశ్ పర్యటనతో వైకాపా నేతల వెన్నులో వణుకు
పల్నాడులో లోకేశ్ చేసిన పర్యటనతో వైకాపా నేతల వెన్నులో వణుకు పుడుతుందని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెదేపా జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
చంద్రబాబుతో యరపతినేని భేటీ
చంద్రబాబుతో మాట్లాడుతున్న యరపతినేని శ్రీనివాసరావు, పక్కన అచ్చెన్నాయుడు
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్టుడే: పల్నాడులో లోకేశ్ చేసిన పర్యటనతో వైకాపా నేతల వెన్నులో వణుకు పుడుతుందని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెదేపా జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును కలసి పల్నాడులో పరిస్థితులు, లోకేశ్ పర్యటనకు ప్రజల్లో నుంచి అనూహ్య స్పందన, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పల్లె పిలుస్తోంది, పల్లెనిద్ర కార్యక్రమాలపై మాట్లాడారు. ‘జల్లయ్య హత్య పట్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీసింది. కర్మకాండలకు, పెద్దకర్మకు లోకేశ్ హాజరై రూ.25 లక్షలకు ఆర్థిక సహాయం చేయడం కార్యకర్తల్లో, జల్లయ్య కుటుంబంలో మనోధైర్యం నింపింది. లోకేశ్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం భావించినా గురజాల, మాచర్లలో కార్యకర్తలు ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి నీరాజనం పట్టారు. గతంలో ఎన్టీఆర్, మీరు పల్నాడు పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలు ఏవిధంగా స్వచ్ఛందంగా తరలివచ్చారో లోకేశ్ పర్యటనలకు ఆవిధంగా వచ్చారు. గురజాలలో అధికార పార్టీ నేతల నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్యకర్తలతో పాటు నేను కూడా ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నా’...అని చంద్రబాబు దృష్టికి యరపతినేని తీసుకువెళ్లారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ ‘కార్యక్రమాన్ని అంతా నేను గమనించాను. ముఖ్యంగా పిడుగురాళ్లలో బాగా చేశారు. ప్రతిఒక్కరూ మీ వలే పని చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపాలి. అండగా ఉండాలి. పల్లె పిలుస్తోంది, పల్లె నిద్ర కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు. ఇదే పంథాను ఎన్నికల వరకు కొనసాగించాలి. మీరు కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా’..అని యరపతినేనిని అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీరివ్వలేని నీరో!
[ 18-04-2024]
సీఎం జగన్... పేదల పక్షపాతినంటారు.. ఎన్నికల్లో వారే తన స్టార్ క్యాంపెయినర్లంటారు.. వారి జీవితాలను బాగు చేసేది తనొక్కడేనంటూ గొప్పలకు పోతుంటారు.. కానీ.. తన నివాసానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్లోని నిరుపేద రోగుల గొంతు తడపలేకపోతున్నారు. -
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు
[ 18-04-2024]
నారీ గళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి, తెలుగు మహిళ నాయకురాలు మాగంటి రూప, తెలంగాణ తెదేపా నాయకులు నన్నూరి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. -
కీలక ఘట్టానికి వేళాయె
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం నేటి నుంచి ఆరంభం కాబోతోంది. గురువారం నుంచి అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. గత తెదేపా ప్రభుత్వంలో రాత్రీ పగలు తేడా లేకుండా వేల మంది కార్మికులతో కళకళలాడిన అమరావతి వైకాపా పాలనలో విధ్వంసానికి చిరునామాగా మారింది. -
జీతాలకూ ఎదురుచూపులే..
[ 18-04-2024]
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు. -
గుంటూరువాసికి క్రికెట్ సైట్ స్క్రీన్పై పేటెంట్
[ 18-04-2024]
జోసెల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, జేకేసీ కళాశాల కార్యదర్శి, గుంటూరు జిల్లా మెన్, ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు, ఏసీఏ ఉమెన్స్ అకాడమీ పూర్వ ఛైర్మన్ జాగర్లమూడి మురళీమోహన్ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. -
శిరోముండనం కేసులో శిక్ష విధించడం హర్షణీయం
[ 18-04-2024]
శిరోముండనం కేసుల్లో నిందితులకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించడం హర్షణీయమని భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు పాగళ్ల ప్రకాష్ అన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. -
సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం
[ 18-04-2024]
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శివశంకర్ కోరారు. -
విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
[ 18-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. -
అయిదేళ్లుగా చోద్యం చూశారు!
[ 18-04-2024]
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు
[ 18-04-2024]
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు