మూడేళ్లు.. మహా ప్రాజెక్టులేవీ?
రాష్ట్రంలోనే కీలకమైన విశాఖ నగరంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకోవడమే తప్ప తిరిగి నగరానికి నిధులు కేటాయింపులు చేయకపోవడం సమస్యగా
ప్రతిపాదనలతోనే కాలం వెళ్లదీత
పైవంతెన ప్రతిపాదించిన హనుమంతువాక కూడలి
కార్పొరేషన్, న్యూస్టుడే: రాష్ట్రంలోనే కీలకమైన విశాఖ నగరంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. మహా విశాఖ నగరపాలక సంస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకోవడమే తప్ప తిరిగి నగరానికి నిధులు కేటాయింపులు చేయకపోవడం సమస్యగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా మూడేళ్లుగా విశాఖ నగరంలో అభివృద్ధి పనులు కానరావడంలేదు. సాధారణ పనులు చేయడానికి జీవీఎంసీˆ గుత్తేదారులు ముందుకు రావడం లేదు. పెద్ద ప్రాజెక్టులను నగరానికి తీసుకురావడంలో, ఇప్పటికే పరిశీలనలో ఉన్న ప్రాజెక్టులను ప్రారంభించడానికి జీవీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టుదల ప్రదర్శించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మూడేళ్లలో ఏమి సాధించారు..?
* 2007 నుంచి 2012 వరకు జేఎన్ఎన్యూఆర్ఎం (జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం)లో భాగంగా చేపట్టిన శీఘ్ర బస్సు రవాణా వ్యవస్థ, పేదలకు ఇళ్లు, మంచినీటి ప్రాజెక్టులు, యూజీడీ, గెడ్డల ఆధునికీకరణ, కూడళ్ల అభివృద్ధి, పైవంతెన ప్రాజెక్టులు నగరానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అనంతరం ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టుకు విశాఖ ఎంపికైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం రూ.1000 కోట్లతో పాటు, జీవీఎంసీˆ మరో రూ.2వేల కోట్ల భాగస్వామ్యంతో ఆయా పనులు చేపట్టింది. ఆయా ప్రాజెక్టులన్నీ మూడేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. ఆ తరువాత జీవీఎంసీ ఒక్క కొత్త ప్రాజెక్టును చేపట్టలేకపోయింది.
శీఘ్ర బస్సు రవాణా వ్యవస్థల అనుసంధానం, కొత్త ప్రాంతాలకు బీఆర్టీఎస్ విస్తరణ, కొండవాలు ప్రాంతాలకు మంచినీటి సరఫరా, గెడ్డల ఆధునికీకరణ వంటి ప్రధాన ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించకపోవడం గమనార్హం.
ఆస్తుల తనఖాతో పనులు...
పెందుర్తి, గాజువాకల్లో చేపట్టిన భూగర్భ మురుగునీటి వ్యవస్థ ప్రాజెక్టుల బిల్లులు చెల్లించడానికి జీవీఎంసీ ఆస్తులను తనఖా పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. గతంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలతోపాటు, స్థానిక సంస్థలు 10శాతం నుంచి 20శాతం నిధులు సమకూర్చేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్థానిక సంస్థలపైనే అధిక భారం వేస్తున్నారు. మరో పక్క ఆదాయం లాగేసుకుంటున్నారు. ఫలితంగా విశాఖలో అభివృద్ధి పడకేసిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పాతవీ కదలడం లేదు..
* ఏలేరు నుంచి నగరానికి మంచినీటిని తరలించడానికి ప్రతిపాదించిన రూ.3,106 కోట్ల పైపులైను ప్రాజెక్టుపై రెండు సార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసినా నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలన్న అంశంపై ఎటూ తేల్చలేదు. దీంతో ప్రాజెక్టు పెండింగ్లోనే ఉంది. వర్షపాతం తక్కువగా నమోదైతే నగరంలో రెండు, మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేసే పరిస్థితులు ఉన్నాయి.
* తీరం కోత నివారణ ప్రాజెక్టు కోసం 2014 నుంచి మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. నీలం, పైలిన్, హుద్ హుద్ తుపానులు వచ్చినప్పుడు తీరం కోతకు గురైంది. దీంతో ప్రపంచబ్యాంకు నిధులు రూ.120 కోట్లతో తీరకోత నియంత్రణ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఆయా నిధుల కోసం ప్రయత్నాలు జరగడం లేదు.
* నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు నాలుగు పైవంతెనలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. రూ.600 కోట్ల వ్యయంతో కారుషెడ్డు, హనుమంతువాక, సత్యం కూడలి, గాజువాక ప్రాంతాలలో పైవంతెనలు నిర్మించడం ద్వారా రద్దీ తగ్గించడంతోపాటు ప్రమాదాలు నియంత్రించవచ్చని భావించారు. ఆయా ప్రతిపాదనలు ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్లోనే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
[ 18-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. -
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: కేఏ పాల్
[ 18-04-2024]
ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కోరారు. రైల్వేన్యూకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి ఎం.పి.గా, గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. -
చూశాం పోలిక ఇక చాలు పాలకా!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పేరిట చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వాస్తవానికి వైకాపా నాయకులు ప్రచారంపై పెట్టిన శ్రద్ధ పనుల పర్యవేక్షణపై లేకపోయింది. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, విశాఖ లోక్సభ నియోజకవర్గాలలో గురువారం నుంచి నామపత్రాలు స్వీకరించనున్నారు. -
మెట్టుకో గండం.. ‘వైకాపా’కో దండం!!
[ 18-04-2024]
నగరంలో లక్షల మందికి ప్రకృతి ప్రసాదిత కొండలే ఆవాసాలుగా మారాయి. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు తక్కువ అద్దెలుంటాయని కష్టాలు పడైనా ఇక్కడే ఉంటున్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల ఆశలు ఆవిరి
[ 18-04-2024]
ఉద్ధరిస్తానని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ప్రభుత్వం తమను నిండా ముంచిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. విలీనమై ఏళ్లు గడిచినా కార్మికులకు దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోగా... అనేక భత్యాలను కోల్పోవాల్సి వచ్చింది. -
నాడు-నేడు.. దోచేశారు చూడు!
[ 18-04-2024]
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తామని చెప్పి స్కూళ్లలో పనులు అస్తవ్యస్తంగా చేసి వదిలేశారు. రూ. వందల కోట్లు ఖర్చయినట్లు దస్త్రాల్లో చూపిస్తున్నా ఆ మేరకు పనులు కనిపించడం లేదు. -
రేషన్లో కోత.. ధరల వాత
[ 18-04-2024]
ఇంటింటా రేషన్ ఇస్తున్నామని ప్రచారం తప్ప కార్డుదారులకు అందించాల్సిన నిత్యావసరాలను మాత్రం ఇవ్వడం లేదు. బియ్యం తప్ప ఇతర సరకులేవీ లబ్ధిదారులకు అందడం లేదు. అది కూడా కేంద్రం ఇచ్చిన బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. -
జగదభిరాముని కల్యాణం.. చూసిన కనులదే వైభోగం
[ 18-04-2024]
కనకమహాలక్ష్మి ఆలయ దత్తత అంబికాబాగ్ ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
తోట త్రిమూర్తులుపై పోరాటం ఆగదు
[ 18-04-2024]
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుపై కోర్టు విధించిన శిక్ష నేర తీవ్రతకు సరిపడా లేదని, ప్రజాక్షేత్రంతో పాటు న్యాయస్థానాల్లోనూ తగిన శిక్ష పడే దాకా తమ పోరాటం కొనసాగుతుందని విశాఖ దళిత సంఘం (విదసం) ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
[ 18-04-2024]
యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. -
నాడు-నేడు.. ఐదేళ్లు సరిపోలేదు
[ 18-04-2024]
నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలకు మహర్దశ పట్టిస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయకుండా చేతులెత్తేశారు. ఏడాదిన్నరగా రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. -
కొణతాల ప్రచారంలో జబర్దస్త్ నటుల సందడి
[ 18-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా బుధవారం జబర్దస్, సినీ నటులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. -
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ తెదేపాలో చేరిక
[ 18-04-2024]
విశాఖ డెయిరీ మాజీ ఛైర్మన్ దాడి సూర్యజగన్నాథరావు (కృష్ణ) తన అనుచరులతో కలిసి బుధవారం రాత్రి వైకాపాను వీడి తెదేపాలో చేరారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. -
మీ కష్టం ఉంచుకోను.. తగు రీతిలో చూసుకుంటా
[ 18-04-2024]
‘డియర్ వాలంటీర్స్.. మీ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి. చంద్రబాబు మీపై చేసిన ఫిర్యాదు మేరకు రాజీనామా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేయండి. -
ఉక్కు ఉత్పత్తిపై సమ్మె పోటు
[ 18-04-2024]
‘అదానీ గంగవరం పోర్టు’లో కార్మికులు చేపట్టిన సమ్మెతో విశాఖ ఉక్కుకు కష్టకాలం ఎదురయింది. పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. -
యువతి అదృశ్యం
[ 18-04-2024]
పీఎంపాలెం ప్రాంతంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వై.రామకృష్ణ తెలిపారు. క్రికెట్ స్టేడియం ఎదురు కాలనీకి చెందిన యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ