‘బుసక’ మాయం
ప్రభుత్వ పరమైన నిర్మాణాలకు మండల స్థాయి అధికారుల అనుమతితో సమీప ప్రాంతాల నుంచి బుసక రవాణా తీసుకున్న అనుమతుల మాటున రోజూ పెద్ద మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిపోతోంది. అక్రమ రవాణా కారణంగా తలెత్తే ఇబ్బందులను భరించలేని స్థానికులు కృత్తివెన్ను, పెడన...
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే
ప్రభుత్వ పరమైన నిర్మాణాలకు మండల స్థాయి అధికారుల అనుమతితో సమీప ప్రాంతాల నుంచి బుసక రవాణా తీసుకున్న అనుమతుల మాటున రోజూ పెద్ద మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిపోతోంది. అక్రమ రవాణా కారణంగా తలెత్తే ఇబ్బందులను భరించలేని స్థానికులు కృత్తివెన్ను, పెడన, మచిలీపట్నం, నడకుదురు, అవనిగడ్డ తదితర ఇసుక రవాణా చేసే వాహనాలను అడ్డగించడం, కొన్ని వాహనాలకు అధికారులు జరిమానా విధించడం వంటి ఉదంతాలున్నాయి. మచిలీపట్నం, పెడన పరిధిలో వాహనాలను అడ్డగించిన రెవెన్యూ సిబ్బందిపై దాడులకు సైతం వెనకాడని పరిస్థితిపై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంఘటనలూ లేకపోలేదు. బందరు నియోజకవర్గ పరిధిలో మట్టి, బుసక రవాణా మొత్తం ముగ్గురు, నలుగురు వ్యక్తుల కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నారు. సీఆర్జెడ్ పరిధితో పాటు దీర్ఘకాలంగా తీరప్రాంతానికి రక్షణగా ఉండే ఇసుక దిబ్బలను మటుమాయం చేసేశారు.
మైనింగ్ శాఖ పరిధిలోకి వచ్చే ఇసుక, మట్టి, బుసక తదితరాలను అధికారుల అనుమతి పర్యవేక్షణ లేకుండా తవ్వకాలు చేపట్టరాదనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. నదీతీర ప్రాంతం, సీఆర్జెడ్ పరిధిలో తవ్వకాలు పూర్తిగా నిషిద్ధం.అయినా కొన్ని నెలలుగా సీఆర్జెడ్ పరిధిలోకి వచ్చే మచిలీపట్నం, కృత్తివెన్ను, కోడూరు, నాగాయలంక మండలాలతో పాటు పెడన, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, తదితర మండలాల్లో లక్షలాది క్యూసెక్కుల బుసక తరలిపోయింది. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నదీ తీరప్రాంతంలో స్థానికులు కలవరపడేలా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో కీలక నాయకునిగా చలామణి అవుతున్న ఓ నాయకుని పర్యవేక్షణలో నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి మాఫియా చెలరేగిపోతుందన్న ఆరోపణలున్నాయి.చల్లపల్లి మండల పరిధిలోని ఏనుగులదిబ్బతో పాటు మచిలీపట్నం వెస్ట్, పోలాటితిప్ప, తపసిపూడి, కృత్తివెన్ను తదితర ప్రాంతాల్లోని ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణగా ఉండాల్సిన మెరకదిబ్బలను ఆనవాళ్లే లేకుండా చేసేశారు. కృతివెన్ను మండల పరిధిలోని సీఆర్జెడ్ భూముల్లో మట్టి తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్నారు.
బుట్టదాఖలైన ఫిర్యాదులు
పెడన నియోజకవర్గ పరిధిలో కాల్వగట్టులతో పాటు గూడూరు మండలంలో జనావాసాల మధ్య, ఇతర ప్రాంతాల్లో చేపట్టిన అక్రమ తవ్వకాలపై స్థానికులు చేసిన ఫిర్యాదులు బుట్టదాఖలే అయ్యాయి. పెడన పైడమ్మ, పల్లోటి 1, 2 లేఔట్లకు సంబంధించి రూ.6 కోట్ల అంచానా వ్యయంతో చేపట్టిన పనుల్లో అవినీతితో పాటు మట్టి అక్రమ రవాణా చేశారన్న అభియోగాలున్నాయి. మెరక అవసరాలకు తగిన విధంగా మట్టి లభ్యత తగ్గిపోతుండంతో తాజాగా అక్రమార్కులు దృష్టి అసైన్డ్భూములపై పడింది. పట్టాదారులను చెరువుల లీజు పేరున తమదైన శైలిలో ఒప్పించి కొంత మట్టిని తరలించేస్తున్నారు. అధికారుల పర్యటనలకు సంబంధించిన సమాచారం ముందే తెలిసే ఏర్పాట్లు చేసుకుని వారు వచ్చే రోజు పనులు నిలిపివేస్తున్నారు. ఎవరైనా సొంత భూముల్లో మట్టిని తరలించుకోవాలన్నా అనుమతులు ఇవ్వనీయకుండా అడ్డుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల ఆర్జన కల్పిస్తున్న మట్టి, బుసక అక్రమ వ్యాపారం బహిరంగ రహస్యమే అయినా నామమాత్రపు కేసులు కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా మట్టి మాఫియా దోపిడిని అరికట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
అధికారులు ఏమంటున్నారంటే..
ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే అభివృద్ధి పనులకు మాత్రమే అనుమతులు ఇస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా బుసక తరలిస్తున్న విషయం మా దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా