AP News: అధికారులు వేధిస్తున్నారంటూ హోంగార్డు ఆత్మహత్య.. ఆవేదనతో సెల్ఫీ వీడియో!

విజయవాడ కృష్ణలంకలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్ హోంగార్డు తిమ్మసత్తి వెంకటేశ్వరరావు..

Updated : 27 Jan 2022 05:20 IST

విజయవాడ: విజయవాడ కృష్ణలంకలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఏఆర్ హోంగార్డు తిమ్మసత్తి వెంకటేశ్వరరావు.. తన ఆత్మహత్య కారణాలను వెల్లడించిన సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టాస్క్ ఫోర్స్ విభాగంలోని ఉన్నతాధికారులు తనను తీవ్రంగా వేధించేవారని సెల్ఫీ వీడియోలో వెంకటేశ్వరరావు ఆరోపించారు. 2021 ఆగస్టులో తాను హోంగార్డుగా విధుల్లో చేరి.. ఎస్సీ, ఎస్టీ సెల్ విభాగంలో పనిచేసినట్లు చెప్పారు. అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లి వచ్చేలోగా తనను టాస్క్‌ఫోర్స్‌కు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ అధికారులు తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారంటూ వాపోయారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని