Andhra News: పవన్ను దూషిస్తేనే మంత్రుల ఫైళ్లపై సంతకాలా?: జనసేన నేత కిరణ్ రాయల్
సీఎం జగన్ సహా మంత్రులంతా సీబీఐ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దత్తపుత్రులని జనసేన నేత కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్పై పలువురు మంత్రులు ఆరోపణలు
తిరుపతి: సీఎం జగన్ సహా మంత్రులంతా సీబీఐ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దత్తపుత్రులని జనసేన నేత కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్పై పలువురు మంత్రులు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తిరుపతిలో జనసేన నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ జగన్ కేబినెట్లో ఉన్నవారు మంత్రులా? కంత్రులా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో మరోసారి తీవ్ర పదజాలం వాడితే వారికంటే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని కిరణ్ హెచ్చరించారు. తమ స్పందన ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. పవన్ను దూషిస్తేనే మంత్రుల ఫైళ్లపై సీఎం సంతకం చేస్తున్నారా? అని కిరణ్ రాయల్ నిలదీశారు. ఈ సందర్భంగా ‘రాష్ట్రానికి కొత్తగా వచ్చిన విష సర్పాలు’ పేరుతో ఉన్న పోస్టర్ను జనసేన నేతలు ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?