Andhra News: పేలిన ల్యాప్‌టాప్‌.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి తీవ్ర గాయాలు

వైఎస్‌ఆర్‌ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లెలో ల్యాప్‌ట్యాప్‌ పేలింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సుమతి తన ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్‌

Published : 18 Apr 2022 14:37 IST

బి.కోడూరు: వైఎస్‌ఆర్‌ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లెలో ల్యాప్‌ట్యాప్‌ పేలింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సుమతి తన ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్‌ పెట్టి వర్క్‌ చేస్తుండగా ఉన్నట్టుండి అది పేలడంతో మంటలు వచ్చాయి.

ఈ ఘటనలో సుమతి తీవ్రంగా గాయపడటంతో ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే కడపలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగకపోవడంతో ల్యాప్‌ట్యాప్‌ పేలిన విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని