Viswarup: అమలాపురం ఆందోళనలో రౌడీషీటర్లు.. సంఘ విద్రోహశక్తులు: మంత్రి విశ్వరూప్
కోనసీమ ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురంలో మంగళవారం
అమలాపురం: కోనసీమ ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అమలాపురంలో మంగళవారం జరిగిన ఆందోళన విధ్వంసానికి దారి తీయడం.. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను ఆందోళనకారులను తగులబెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు తగులబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘అమలాపురం ప్రజానీకం ఎప్పుడూ తప్పుడు ఆలోచనతో లేరు. మంగళవారం జరిగిన ఘటనలకు కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలి. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనలో కొన్ని సంఘ విద్రోహశక్తులు, కొంతమంది రౌడీషీటర్లు చేరి దశ, దిశ లేని ఉద్యమాన్ని పక్కదోవ పట్టించారు. నాతో పాటు, ఎమ్మెల్యే సతీశ్ ఇంటిని తగులబెట్టారు. గమ్యం లేని ఉద్యమాన్ని మా ఇళ్లవైపు మళ్లించారు. అక్కడికి సమీపంలోనే ఉన్న తెదేపా మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదు? అమలాపురంలో జరిగిన ఘటనల వెనుక తెదేపా, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు.
ప్రభుత్వం ముందు ‘కోనసీమ’ అనే నామకరణం చేసింది. జనసేన, భాజపా, తెదేపా.. అందరూ అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరాయి. కోనసీమలోని దళిత సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరూ రోడ్లపైకి రావొద్దు..సంయమనం పాటించండి..రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దు’’ అని విశ్వరూప్ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?