NTR Fan Janardhan: జూ.ఎన్టీఆర్ వీరాభిమాని జనార్దన్ కన్నుమూత

ఎన్టీఆర్‌(NTR) వీరాభిమాని జనార్దన్‌(Janardhan) కన్నుమూశారు. కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదానికి గురైన జనార్దన్‌ తిరుపతిలోని

Published : 06 Jul 2022 01:54 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌(NTR) వీరాభిమాని జనార్దన్‌(Janardhan) కన్నుమూశారు. కొద్ది రోజుల కిందట రోడ్డు ప్రమాదానికి గురైన జనార్దన్‌ తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఎన్టీఆర్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జనార్దన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కొన్ని రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో జనార్దన్‌ ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లాడని తెలుసుకుని తారక్‌ అతడి కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ‘‘నువ్వు కోలుకుని రా. మనం త్వరలో కలుద్దాం’’ అంటూ అభిమానికి ధైర్యం చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్‌ మాట్లాడిన వీడియో వైరల్‌ అయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని