Ayyanna Patrudu: నర్సీపట్నంలో ఉద్రిక్తత.. అయ్యన్న ఇంటి చుట్టూ భారీగా పోలీసులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్న ఇంటి
అంతే సంఖ్యలో తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు
నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్న ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. నీటిపారుదల శాఖకు చెందిన స్థలం ఆక్రమించారనే ఆరోపణలతో అయ్యన్న ఇంటి గోడను ఆదివారం వేకువజామున మున్సిపల్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా గోడ కూల్చేశారంటూ అయ్యన్న కుటుంబసభ్యులు, తెదేపా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు చింతకాయల రాజేశ్ను పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో భారీగా తెదేపా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. గోడ కూల్చివేతకు వచ్చిన జేసీబీ టైర్లలో గాలిని అయ్యన్న అనుచరులు తీసేశారు. ఇప్పటికే వంద మందికి పైగా పోలీసులు అక్కడ ఉండగా.. మరో 3 బెటాలియన్లను అదనంగా తీసుకొచ్చి మోహరించారు. అంతే సంఖ్యలో అభిమానులు, తెదేపా కార్యకర్తలు అక్కడికి వచ్చి అయ్యన్న కుటుంబానికి మద్దతుగా నిలిచారు. అక్కడే టెంట్ వేసి మున్సిపల్ సిబ్బంది, పోలీసుల వైఖరి పట్ల నిరసన తెలుపుతున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అయ్యన్న ఇంటి వద్దకు వచ్చి కూల్చివేసిన గోడను పరిశీలించారు. మరోవైపు అయ్యన్న ఇంటికి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆయన నివాసానికి వెళ్లే 2 మార్గాలను పోలీసులు మూసివేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM