Raghurama: ఆ లిస్టులో నా పేరు లేదంటే ఆశ్చర్యపోయా: ఎంపీ రఘురామ

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతికి ప్రధాని నరేంద్రమోదీ భీమవరం రావడం గర్వకారణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రధాని వచ్చినపుడు సభకు వెళ్లాల్సిన

Published : 04 Jul 2022 14:55 IST

దిల్లీ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతికి ప్రధాని నరేంద్రమోదీ భీమవరం రావడం గర్వకారణమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రధాని వచ్చినపుడు సభకు వెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని.. తనను అక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు. కొన్ని విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడారు.

‘‘విషనాగులే పాలకులు అవుతారని ఆనాడు అనుకోలేదు. ప్రధాని పర్యటన లిస్టులో నా పేరు లేదనేసరికి ఆశ్చర్యపోయా. ఇవన్నీ తెలిసే ప్రొటోకాల్‌ వంటి అంశాలపై అధికారులకు ముందే లేఖ రాశా. నా పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థం కావట్లేదు. కోర్టులు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలి?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని