SCR: సంక్రాంతి సందర్భంగా 8 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ టౌన్‌-లింగంపల్లి మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ

Published : 17 Jan 2022 16:29 IST

హైదరాబాద్‌: సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ టౌన్‌-లింగంపల్లి మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాకినాడ టౌన్‌-లింగంపల్లి మార్గంలో ఈనెల 24, 26, 28, 31 తేదీల్లో నాలుగు ప్రత్యేక రైళ్లు, లింగంపల్లి- కాకినాడ టౌన్‌ మధ్య ఈనెల 25, 27, 28, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని