Andhra news: వైకాపా నాయకులు రాష్ట్ర ఖజానాను దోచేశారు: అయ్యన్న పాత్రుడు
జగన్ మూడేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.
విశాఖపట్నం: జగన్ మూడేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. మద్యం అమ్మగా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని పాలిస్తామని స్వయంగా సీఎం జగన్ అసెంబ్లీలో అనడం సిగ్గు చేటని ఆయన అన్నారు. విశాఖ తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవుల కోసం శాసనసభ్యులంతా అసెంబ్లీలో జగన్ భజనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానాలోని డబ్బులు కూడా దోచేశారని, రూ.48 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు లేవని కాగ్ నివేదికలో చెప్పినట్లు అయ్యన్న గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రం ఎందుకు చూస్తూ ఊరుకుంటోందని ప్రశ్నించారు.
కాగ్ నివేదికలో పేర్కొన్న రూ.48వేల కోట్ల పైన సీబీఐ విచారణ వేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు. దాదాపు రూ.7లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ సొమ్మును ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. కల్తీ మద్యం తాగి చనిపోయినవారి కుటుంబీకులు ఏడవడంలేదని, సీఎం జగన్ అనడం ఆయన అవివేకానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఇంకా వైకాపా ప్రభుత్వానికి రెండేళ్ల సమయముందని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. ఈనెల 29 నాటికి తెదేపా ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. విజయవాడలో వచ్చే నెల 3న మహానాడు నిర్వహిస్తున్నట్లు అయ్యన్న తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం