AP New Districts: రాజంపేటలో ఆందోళనలు.. ఎక్కడికక్కడ పోలీసుల ఆంక్షలు

ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనపై పలు ప్రాంతాల్లో అసంతృప్తి చెలరేగుతోంది. ప్రస్తుత కడప జిల్లాలోని రాజంపేటను

Published : 28 Jan 2022 12:04 IST

రాజంపేట: ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనపై పలు ప్రాంతాల్లో అసంతృప్తి చెలరేగుతోంది. ప్రస్తుత కడప జిల్లాలోని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ ఆ ప్రాంతవాసులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజంపేటను కాదని.. రాయచోటిలో తమను కలపడమేంటని ప్రశ్నిస్తున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. 

ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద విద్యార్థి, యువజన సంఘాలు రాస్తారోకోకు యత్నించాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. విద్యార్థి, యువజన సంఘాల నేతలు అక్కడికి రాకుండా కట్టడి చేస్తున్నారు. గుమిగూడిన వారందరినీ చెదరగొడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను కూడా అనుమతించలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని