Andhra News: ‘రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తాం’: తెదేపా నేతకు బెదిరింపులు

వైఎస్సాఆర్‌ జిల్లా కమలాపురంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌ శర్మ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

Updated : 17 May 2022 09:19 IST

కమలాపురం: వైఎస్సాఆర్‌ జిల్లా కమలాపురంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌ శర్మ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజకీయాలు మానుకోకుంటే చంపేస్తామని కాగితాలపై రాసి కారుకు అంటించారు. కమలాపురంలో రామాపురం గుడి వద్ద కారు నిలిపి ఉండగా ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటాక కారు ధ్వంసం చేసినట్లు తెదేపా నాయకులు భావిస్తున్నారు.

సాయినాథ్‌ కారుతో పాటు ఆయన ఇంటికి కూడా దుండగులు కాగితాలు అంటించారు. రాజకీయాలు నీకెందుకు అంటూ బెదిరిస్తూ రాసిన లేఖలు అంటించడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో సాయినాథ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపు కమలాపురంలో తెదేపా అధినేత చంద్రబాబు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని