Revanth Reddy: అభివృద్ధి ముసుగులో రైతుల ఉసురు తీయొద్దు: రేవంత్రెడ్డి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని టీపీసీసీ
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
‘‘అక్కంపేటలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. రెవెన్యూ గ్రామ హోదా కూడా లేదు. అక్కంపేటపై అలక్ష్యం.. జయశంకర్పై అక్కసును చాటుతోంది. దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని.. అక్కంపేటలో ఓ కుటుంబాన్ని చూస్తే అర్థమైంది. వరంగల్ ఓఆర్ఆర్ కోసం వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఓఆర్ఆర్ మాత్రం పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోంది. దీని వల్ల లక్షమందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అభివృద్ధి ముసుగులో రైతుల ఉసురు తీయొద్దు. భూ సేకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి రైతులు దినదినగండంగా గడుపుతున్నారు. ఓఆర్ఆర్ జీవో ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రైతుల తరఫున క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఉద్యమిస్తుంది’’ అని లేఖలో రేవంత్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం