kurnool : కర్నూలు జిల్లాలో జంట హత్యల కలకలం

కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కౌతాళం మండలం కామవరంలో భూముల అంశంపై... వైకాపా, భాజపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో వేట కొడవళ్ళతో దాడి చేసి అత్యంత కిరాతకంగా...

Updated : 28 Jan 2022 04:21 IST

కౌతాళం : కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కౌతాళం మండలం కామవరంలో భూముల అంశంపై... వైకాపా, భాజపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో వేట కొడవళ్ళతో దాడి చేసి అత్యంత కిరాతకంగా ప్రత్యర్థులను చంపేశారు. చనిపోయిన ఇద్దరిని వైకాపాకు చెందిన శివప్ప, ఈరన్నగా గుర్తించారు. శివప్ప స్థానిక సర్పంచ్ సోదరుడని పోలీసులు తెలిపారు. ఈ ఘర్షణలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు