అదే ముఖ్యాంశం
అన్ని మతాలకు సమ్మతమైనది దైవ ప్రార్థన. అది సర్వమత సారం, సర్వ ఆత్మతత్త్వం అంటారు గాంధీజీ. ఈ ప్రపంచం ఊహించలేని మహత్తరమైన విషయాలను ప్రార్థన ద్వారా సాధించవచ్చని పాశ్చాత్య కవి లార్డ్ ఆల్ఫ్రెడ్ డెనిసన్ వ్యాఖ్యానించారు.
అన్ని మతాలకు సమ్మతమైనది దైవ ప్రార్థన. అది సర్వమత సారం, సర్వ ఆత్మతత్త్వం అంటారు గాంధీజీ. ఈ ప్రపంచం ఊహించలేని మహత్తరమైన విషయాలను ప్రార్థన ద్వారా సాధించవచ్చని పాశ్చాత్య కవి లార్డ్ ఆల్ఫ్రెడ్ డెనిసన్ వ్యాఖ్యానించారు. మతంలేనిదే మనిషికి మనుగడ సాగదంటారు. ప్రార్థన మేలుకొన్న ఆత్మ స్వగతంలాంటిది. అది ఒక రకమైన ధ్యానయోగం. ధ్యానం (ధీ-యానం) అంటే భగవంతుడి దిశగా బుద్ధి పయనం. ప్రార్థన... ఆ పయనం విజయవంతం చేయడానికి పనికొచ్చే ఉపాయం, ఉపకరణం.
మామూలుగా మనిషి చేసే విన్నపాలు తన గురించి, తన బాధల గురించి, కోరికల గురించి ఎక్కువగా ఉంటాయి. భక్తులు నాలుగు రకాలని భగవానుడే గీతోపనిషత్తులో స్పష్టంగా చెప్పాడు. ఆర్తి, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని తన భక్తులేనని, అందరిలో జ్ఞాని తనకు మిక్కిలి ఇష్టమైన వాడని కూడా కృష్ణపరమాత్మ చెప్పాడు. ఆర్తి జ్ఞానిగా మారేదాకా వారిని భరించక తప్పదు. నాకు అది కావాలి, ఇది కావాలి అంటూ చిన్న కుర్రాడిలా మారాం చేసేవాడు ఆర్తి. అందమైన సుందరాంగి సోయగాన్ని చాటుమాటుగా ఆస్వాదిస్తూ, అర్రులు చాచే కోడెగాడి వంటివాడు జిజ్ఞాసువు. ఇహపరాల నడుమ కొట్టుమిట్టాడుతూ, పరమార్థం సాధించేది ఎలాగా అని తపన పడే మధ్య వయస్కుడు అర్థార్థి. ఏ కోరికా లేక, భగవంతుడి పట్ల విశ్వాసం కలిగి, సదా భజిస్తూ (సేవిస్తూ) శరణార్థి అయిన భక్తుడు జ్ఞాని. మిగతా భక్తులు ముగ్గురూ ఆ స్థాయికి ఎదిగి రావాలన్నదే భగవంతుడి కోరిక, ఉద్దేశం. జ్ఞాని మాత్రమే తనవాడు, మిగతా వాళ్లు కాదన్న అర్థంతో విమర్శించకూడదు. పాపులు, పుణ్యాత్ములు, మంచివాళ్లు, చెడ్డవాళ్లు, ఆస్తికులు, నాస్తికులు... అందరూ భగవంతుడి బిడ్డలే.
వేడికోలు అంటే అన్వేషణ. ‘స్వామీ! ఎక్కడున్నావు? మమ్మల్ని ఉద్ధరించు... సరైన దారి చూపించు’ అని అందరి కోసం ప్రతిదినం, వీలైతే ప్రతి క్షణం ఆ భగవంతుడిని ప్రార్థించాలి. అందరి బాగులో మన బాగూ ఉన్నది. ‘సర్వే జనా స్సుఖినోభవంతు’. అలాంటి వేడికోలు మనకు శక్తిని, యుక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది. ముల్లోకాలను వెలిగించే ఆ పరమాత్మను గురించిన గాయత్రీ మంత్రోపాసన పరమ పవిత్రమైన విశ్వజనీనమైన ప్రార్థన. ‘లోకాస్సమస్తా స్సుఖినోభవంతు’. ఇది కుల, జాతి, మతాతీతమైన మంత్రజపం. ముప్పొద్దులా మంత్రాన్ని నిష్ఠాగరిష్ఠంగా అనుష్ఠించగల వ్యక్తి లోకకల్యాణ చక్రవర్తి!
శ్రీ శంకరుల ‘శివాపరాధ శమాపన స్తోత్రం’ (13) ‘అందరికీ అండగా నిలిచే నువ్వే మాకు దిక్కు. నిన్ను శరణు కోరినవారిని రక్షించు’ అంటున్నది. మహాపాపి అయినా దైవనామ స్మరణ ద్వారా (అజామీలుడిలాగా) పునీతుడై పుణ్యలోకాలు చేరుకోవచ్చునని గీతామాత చెబుతున్నది. ప్రార్థన రోజూ రెండు పూటలా చేయాలి. వీలైనప్పుడో, వారానికో రోజో మొక్కుబడిగా చెల్లిస్తే ఉపయోగం లేదు. అవన్నీ తావిలేని పూలతో సమానం. రెండు పూటలా శుభ్రంగా స్నానం చేయకపోతే శరీరం మకిలి పట్టి మనతోపాటు అందరినీ వేధిస్తుంది. ప్రార్థనతో ప్రక్షాళనం చేయకపోతే మనసుకూ మాలిన్యం పడుతుంది. ఉదయం నిద్ర లేవగానే తలుపు తాళం తీసినట్టుగా, మనసు తెరిచి ఆ భగవంతుణ్ని ప్రార్థించాలి. చీకటి పడగానే తలుపు గొళ్లెం భద్రంగా పెట్టినట్టు, నిద్రకు ఉపక్రమించే ముందూ భగవంతుణ్ని ప్రార్థించాలి. ఏ దేవుడిని ప్రార్థిస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఎలా ప్రార్థిస్తున్నాం అన్నదే ముఖ్యాంశం!
- ఉప్పు రాఘవేంద్రరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్