సుఖం - దుఃఖం
సుఖదుఃఖాలు రెంటినీ మనిషి అనుభవిస్తాడు. సుఖం అనుభవిస్తున్నప్పుడు మనిషి ఏం నేర్చుకోడు. నేర్చుకునే అవకాశం అందులో లేదు. అది ఖాళీ పళ్లెంలో పెట్టిన ఊహా భోజనం మాత్రమే.....
సుఖదుఃఖాలు రెంటినీ మనిషి అనుభవిస్తాడు. సుఖం అనుభవిస్తున్నప్పుడు మనిషి ఏం నేర్చుకోడు. నేర్చుకునే అవకాశం అందులో లేదు. అది ఖాళీ పళ్లెంలో పెట్టిన ఊహా భోజనం మాత్రమే.
ఎంత సుఖపెట్టినా శరీరం మరో సుఖం కావాలని కోరుకుంటుంది. ఆ మాయ వలలో పడితే అంతే మరి. అందులో ఇరుక్కుని గిలగిలా తన్నుకోవడమే చివరికి జరిగేది. సుఖం లేకపోతే బతుకెందుకు, ఎందుకు బతకాలని చాలామంది సూటిగా ప్రశ్నిస్తారు.
చాలామందికి సుఖమే జీవన పరమావధి అంతిమ లక్ష్యం. అదే జీవనగమ్యం. కాని, ఎల్లప్పుడూ అలా కుదరదు. నిరంతరం సుఖంగా ఉండలేం. సుఖం ఒక్కటే కలకాలం ఉండిపోదు. వచ్చిపోయే రుతువుల్లాగా సుఖం తరవాత దుఃఖం వస్తూ ఉంటుంది. దుఃఖాన్ని తిరస్కరించి సుఖాన్ని స్వీకరించడానికి అందరూ సిద్ధమవుతారు. అదీ కుదరదు. జీవితం అలా ఉండదు. ప్రకృతి ధర్మాలు ఒప్పుకోవు.
శరీరానికి పరిమితులున్నాయి. అది అనుభవించే భావాలకూ పరిమితులున్నాయి. సుఖం ఒక పరిమితి దాటితే దుఃఖంగా మారిపోతుంది. ఏదైనా ఎక్కువైతే వికటిస్తుంది.
శ్రీరాముడు సుఖపడలేదు. దేవుడి పరిస్థితే అలా ఉంటే, మన పరిస్థితి ఏమిటి? అలాగని ఎవరైనా పెద్దవాళ్లను అడిగితే- ఆయన కష్టం కోసం పుట్టాడు. కారడవి కోసం పుట్టాడు, దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ కోసం పుట్టాడు, అందుకే జీవితం త్యాగం చేశాడని చెబుతారు. పాండవులు కష్టాలతో కలిసి జీవించారు. అయినా వాళ్లు బాధపడలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు వాళ్ల వెన్నంటే ఉన్నాడు.
చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించ కుండా తప్పించుకోలేం. అయితే మనవాళ్లు అనే మంచి మనుషులు మన వెంట ఉంటే సులువుగా ఆ బాధలకు అతీతంగా వెళ్ళిపోగలం. సుఖాల్లో మనుషులు మన చుట్టూ చేరతారు. ఎవరెవరో తెలియదు. దుఃఖాల్లో చివరి వరకు మనతో ఉండేవారే నిజమైన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు. ఎటువంటి మనిషినైనా దుఃఖం దేవుడికి సమీపంలోకి తీసుకు వెళ్తుంది. దుఃఖం అనేది లేకపోతే మనిషి దేవుడి మాట ఎత్తే అవకాశమే లేదు.
కొలిమిలో కాల్చిన బంగారంలా దుఃఖాలు మనల్ని శుద్ధి చేస్తాయి. లోపలున్న నిజమైన మనిషిని బయటికి తీసుకొస్తాయి. ‘కష్టాలు ఉన్నప్పుడే నువ్వు వస్తానంటే, నాకు కష్టాలు మాత్రమే ఇవ్వు స్వామీ!’ అని కుంతీదేవి శ్రీకృష్ణుడిని కోరుకుంది. ఆ మహాతల్లికున్న గుండె నిబ్బరం, శక్తి మనకు లేవు. కాని, కొద్దో గొప్పో పరిస్థితులు అనుకూలించనప్పుడు, తప్పనిసరై దుఃఖం ముంచుకొస్తున్నప్పుడు గుండె రాయి చేసుకోవాలి. ఎక్కువ ఆత్మనిందకు పాల్పడకుండా నిలబడాలి.
అర్జునుడి విషాదం మనకు లేదు. యుద్ధం మధ్యలో మనం లేం. బంధువులు, బంధాలు ఉన్నాయి. హాయిగా బతకాలనే ఆశ ఉంది. అంత తీవ్రమైన విషాదం అర్జునుడిని చుట్టుముట్టింది. కాబట్టే, అంతర్యామి కరుణించాడు. పరమాత్మ విశ్వరూపం చూపించాడు. చీకట్లతో కూడిన సూర్యాస్తమయం తరవాత క్రమంగా తేజోవంతమైన సూర్యోదయం తప్పక ఉంటుంది.
అందుకే- ఎవరైతే ఆత్మజ్ఞాన సంభూతులో వాళ్లు సుఖ, దుఃఖాతీతులవుతారని శ్రీరామకృష్ణ పరమహంస అంటారు.
- ఆనందసాయి స్వామి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. -
ధర్మ రక్షణ
సుపరిపాలన అనే మాట తరచుగా వింటుంటాం. రామాయణ మహా భారతాల్లో మంచి పరిపాలన అంటే ఏమిటో పాలకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో, ఏ గుణాలు ఉండకూడదో మహర్షులు చెప్పారు. అనేక క్లిష్ట సమయాల్లో ధర్మ స్థాపన యత్నాల్లో సంఘర్షణల్లో పురాణపురుషుల నుంచి మార్గదర్శనం లభించడం మన ఇతిహాసాల్లో కనిపిస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా