రాగం - విరాగం
దాదాపు ప్రతి మనిషీ సుఖాలను, భోగాలను కోరుకుంటాడు. అయితే ఏదో ఒక దశలో ఈ ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి తగ్గి విముఖత, విసుగు జనిస్తాయి. యాంత్రిక జీవితం మీద విరక్తి కలుగుతుంది. అప్పుడు అనురక్తి స్థానే వైరాగ్యం చోటు...
దాదాపు ప్రతి మనిషీ సుఖాలను, భోగాలను కోరుకుంటాడు. అయితే ఏదో ఒక దశలో ఈ ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి తగ్గి విముఖత, విసుగు జనిస్తాయి. యాంత్రిక జీవితం మీద విరక్తి కలుగుతుంది. అప్పుడు అనురక్తి స్థానే వైరాగ్యం చోటు చేసుకుంటుంది. ఐహిక వాంఛలు తగ్గుముఖం పడతాయి. బంధాలు, అనుబంధాలు శాశ్వతం కాదనే స్థితికి వస్తాడు మనిషి.
భక్తి మార్గంలో పయనించేవారికి ప్రాపంచిక విషయాల పైన, వాంఛల పైన వ్యామోహం ఉంటే అది వాటికి ఆటంకంగా పరిణమిస్తుంది. కాబట్టి సాంసారిక విషయాలను విడిచిపెట్టి వైరాగ్య భావనను పెంపొందించుకోవడం సదా శ్రేయస్కరం. అలాగని కర్తవ్యాన్ని విడిచి దూరంగా ఉండమని కాదు. అలా చేయడం పలాయనవాదం అవుతుంది. శాశ్వతం కానివాటిపట్ల అత్యాసక్తి, వ్యామోహం లాంటివి పనికి రావు. అలాంటి వైరాగ్యమే భక్తిని పెంపొందిస్తుంది. ప్రాపంచిక బంధాలపై మొగ్గు చూపకుండా ఉంటే భక్తిమార్గం సుగమం అవుతుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. మానవుడు ఇంద్రియాలను జయించినప్పుడే అది సాధ్యపడుతుంది. అప్పుడు ఆత్మోత్తేజం కలుగుతుంది. అందుకు మార్గం వైరాగ్యమే. మనిషి తన కర్తవ్యం తాను నిర్వహిస్తూ అనవసర లంపటాలు తగిలించుకోకుండా ప్రశాంత జీవనం సాగించాలి. అదే సమయంలో భగవంతుణ్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. వైరాగ్య సాధనకు సత్య జ్ఞాన దర్శనం అవసరం.
వివేకం ఉంటేనే వైరాగ్యం జనిస్తుంది. ఇది ఒక అత్యున్నతమైన తరగని సంపద. అది మానసిక ఏకాగ్రతకు తోడ్పడుతుంది. ముముక్షత్వాన్ని కలగజేస్తుంది. ప్రాపంచిక బంధాల నుంచి విముక్తి కలగాలనే బలమైన కోరిక కలిగిస్తుంది. ఇది ఆధ్యాత్మిక బలాన్నిస్తుంది. ఎక్కడ వేదన ఉంటుందో, అక్కడ అయిష్టత ఉంటుంది.
ప్రపంచంలో సమస్త పదార్థాలు క్రమంగా నశించేవే. ధనం, సంపదలు, బంధుత్వాలు, బాంధవ్యాలు లాంటివన్నీ నశించే స్వభావం కలిగినవే. వాటిలో శరీరం కూడా ఉంది. అంటే... కొంతకాలానికి అదీ నశించక తప్పదు. అలాంటప్పుడు అశాశ్వతమైన వాటిపై వ్యామోహం పెంచుకోవడం అవివేకం. ఈ శరీరమే అప్రధానమైనదనే భావన కలిగినప్పుడు మిగిలిన వాటిపై మమకారం ఎందుకు అనే వైరాగ్యం కలుగుతుంది. మానవ జీవితం జనన మరణాది దుఃఖమయమని బుద్ధుడు గ్రహించాడు. సుఖం, భోగం, ఆనందం కూడా చివరికి దుఃఖాన్నే మిగులుస్తాయన్నది వాస్తవమని; సమస్త భోగాలను, సంసారాన్ని సైతం తృణప్రాయంగా భావించి వైరాగ్యాన్ని పొంది సన్యాసాన్ని స్వీకరించాడు.
వైరాగ్యం కలవాడు వీతరాగుడు. ముండకోపనిషత్తులో ఆ ప్రస్తావన కనిపిస్తుంది. భగవద్గీతలో సాంఖ్య యోగంలో ‘వీతరాగభయక్రోధో స్థితధీర్మునిరుచ్యతే’ అని చెప్పాడు కృష్ణుడు. ‘అనురాగం, భయం, కోపం లాంటివి లేనివాణ్ని స్థితప్రజ్ఞుడు’ అంటారని దీని భావం.
ప్రస్థుత పరిస్థితుల్లో జీవితంలో ఏదో విసుగు చెంది కర్మను విడిచి పెట్టడం కాని, ఇంటిని విడిచి పెట్టడం కాని చేస్తున్నారు. అది శుష్క సన్యాసం అవుతుంది. ఆ విరక్తితో పాటు, శాశ్వత బ్రహ్మానందం కోసం పరితపించాలి. అప్పుడే అది సరైన సాధన అవుతుంది. అంటే, వివేకంతో కూడిన వైరాగ్యం అన్నమాట. వివేక వైరాగ్యాలు రెండూ కలిసే ఉండాలి. అశాశ్వతమైన వాటి పట్ల తీవ్రమైన నైరాశ్యమే మోక్షానికి మొదటి కారణమని వివేక చూడామణి తెలియజెబుతోంది.
- వి.ఎస్.ఆర్.మౌళి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిలువపై సత్య సందేశం
ఒక బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు. -
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM