దేహమే గేహం
ప్రతి జీవికీ కూడు, గూడు కనీస అవసరాలు. పక్షులు గూళ్లు నిర్మించుకుంటాయి. గిజిగాడి గూడు సొగసు చెప్పతరం కాదు. ఇక మనుషుల సంగతి వేరే చెప్పేదేముంది? ఎవరి స్తోమతను బట్టి వారు పూరిగుడిసె నుంచి రాజమహలు దాకా గృహ నిర్మాణాలు చేసుకుంటారు. అసలు జన్మతోనే జీవికి ఒక గృహం స్వతస్సిద్ధంగా ఉంటుంది- అదే దేహం.
ప్రతి జీవికీ కూడు, గూడు కనీస అవసరాలు. పక్షులు గూళ్లు నిర్మించుకుంటాయి. గిజిగాడి గూడు సొగసు చెప్పతరం కాదు. ఇక మనుషుల సంగతి వేరే చెప్పేదేముంది? ఎవరి స్తోమతను బట్టి వారు పూరిగుడిసె నుంచి రాజమహలు దాకా గృహ నిర్మాణాలు చేసుకుంటారు. అసలు జన్మతోనే జీవికి ఒక గృహం స్వతస్సిద్ధంగా ఉంటుంది- అదే దేహం. ఆ దేహమే జీవికి గేహం(ఇల్లు). జీవుడు ఆత్మతో కలిసినప్పుడు జీవాత్మ అవుతున్నాడు. ఆ జీవాత్మ నిత్యనివాసమే దేహం.
ఈ ఎరుక కలగడమన్నది ఏమంత తేలిక కాదు. సర్వమూ తానే అన్నంతగా దేహభ్రాంతి మనిషిని మోహితుణ్ని చేస్తూంటుంది. దేహం కోసం, గేహం కోసం మనిషి పడే శ్రమ ఇంతింత కాదు. ఒక్కోసారి స్తోమతకు మించి కూడా దేహానికి వస్త్ర, ఆభరణాల అలంకారాలు సమకూర్చుకుంటుంటారు. ఆనందం కోసం అప్పులు చేస్తారు. తిప్పలు పడతారు. గేహం కోసం కూడా అంతే. ఎంత చేసినా ఏదో ఒక పని మిగిలిపోయినట్లనిపిస్తుంది. కదిలిస్తే ఖర్చు అంచనాలను మించిపోతుంది. తీరిగ్గా పశ్చాత్తాప పడాల్సిన పరిస్థితీ ఎదురవుతుంది. వయసు ముదిరిన కొద్దీ దేహం సడలిపోతుంటుంది. శక్తి సన్నగిల్లుతుంటుంది. యౌవనం మధురస్మృతిగా మిగిలిపోతుంది. కటిక వాస్తవం లాగా వార్ధక్యం ఆలింగనం చేసుకుంటుంది. కాలగమనంలో గేహం కూడా తొలి అందాలు, ఆకర్షణలు కోల్పోతుంది. ఏ పండుగకో, పబ్బానికో గేహానికి నవీకరణలు చేయాల్సి ఉంటుంది. ఎన్ని చేసినా గేహ వార్ధక్యం ప్రచ్ఛన్నంగా తొంగిచూస్తూనే ఉంటుంది. కాలప్రభావాలను ఎవరు తప్పించుకోగలరు?
ప్రాపంచిక బంధాలకు బందీ అయి ఉన్నంతకాలం ప్రభావాలు తప్పవు. రాగం ఉన్నంతకాలం వెలుగు వెంట నీడలా ద్వేషమూ ఉంటుంది. రాగద్వేషాలను త్యాగం చేయడమే వైరాగ్యం. కాని, చెప్పినంత తేలిగ్గా వైరాగ్యం అబ్బదు. అబ్బురంగా అగుపించినవన్నీ మనవి కావాలనుకుంటాం. అనుకున్నవన్నీ జరగవు. అనుకోకపోయినా జరగాల్సినవి జరిగిపోతూనే ఉంటాయి. వాటిలో మన ప్రయత్నం, ప్రమేయం ఉండవు. గీతలో చెప్పినట్లు ప్రయత్నమే మన వంతు. ఫలితం దైవేచ్ఛగా లభిస్తుంది. మనం అలా అనుకోం. మనం ఆశించిన ఫలితాలు వస్తాయని, వచ్చి తీరాలనే దృక్పథంతో ఉంటాం. రాకపోతే నిరాశ, నిస్పృహలకు లోనవుతాం. కొందరు బలహీన మనస్కులు ఆత్మహత్య ఆలోచనలూ చేస్తారు. మహాభారతంలో దుర్యోధనుడంతటి దురహంకారికి అలాంటి దుస్థితి దాపురించింది. కానీ, మంచి మాటలతో తేరుకుంటాడు. మనిషికి బలహీన క్షణాల్లో బలమైన నైతిక స్థైర్యం కల్పించగలవారు ఉండాలి. అప్పుడే తెప్పరిల్లి, ధైర్యం అనే తెప్పతో కష్టాల కాలువను దాటగలుగుతాడు. ఆత్మహత్యతో దేహం నశిస్తుందే తప్ప సమస్యలు సమసిపోవు. అవన్నీ తమవారికి చుట్టుకుంటాయి. కాబట్టి, దేహనాశనం కోరుకోకూడదు. కోరుకోవాల్సింది మోహనాశనం. అప్పులపాలయినవాళ్లు ఇళ్లు అమ్ముకుపోతారు. అంతకాలమూ ఇంటి మీద పెంచుకున్న మమకారం విస్మరించక తప్పదు. అలాగే, దేహం పట్ల కూడా మమకారాన్ని త్యజించాల్సిన పరిస్థితులు వస్తాయి. ముఖ్యంగా వార్ధక్యంలో అడుగడుగునా అశక్తత వెక్కిరిస్తుంటుంది. ఇక మమకారానికి తావెక్కడిది? జన్మతో దేహమే కాదు, మనిషికి జ్ఞానధనమూ ఇచ్చి పంపుతాడు భగవంతుడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే జన్మ ధన్యమవుతుంది. లేక పోతే వ్యర్థమవుతుంది. ఒక్క సత్యాన్ని మనిషి జీవనయాన ప్రారంభంలోనే గుర్తుంచుకోవాలి. దేహం ఒక గేహం మాత్రమే. ఇక్కడ నిర్మితమై ఇక్కడే నశించిపోతుంది. ఆరాధించాల్సింది అంతర్యామినే. మరి దేన్నీ కాదు!
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు