వేదవాక్కు
వాక్కు అంటే బ్రహ్మ. వాగ్దేవి సరస్వతి. వాగీశ్వరి అనికూడా అంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, సర్వేశ్వరి, జయిని, కాళిని అని మొత్తం ఎనిమిది నామాలతో విలసిల్లుతుంది. పరబ్రహ్మ....
వాక్కు అంటే బ్రహ్మ. వాగ్దేవి సరస్వతి. వాగీశ్వరి అనికూడా అంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, సర్వేశ్వరి, జయిని, కాళిని అని మొత్తం ఎనిమిది నామాలతో విలసిల్లుతుంది.
పరబ్రహ్మ తత్వ విచారంలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కు నాలుగు విధాలన్నారు. మానవుడు అక్షరసముదాయం నుంచి అనంత సాహిత్యాన్ని సృష్టించుకుంటున్నాడు. ‘అంబా’ అని అరిచే ఆవుదూడ కొంతకాలానికి ఆ అమ్మనే గుర్తించలేనట్లుగా మానవుడు సృష్టికి మూలం అయినదాన్ని తెలుసుకోలేక పోతున్నాడు. పరా, పశ్య, మధ్యమ, వైఖరీ శబ్దాలకు పరబ్రహ్మతత్వ విచారంలో పండితులు పలు వివరణలు ఇచ్చారు. విత్తు మొలకెత్తడానికి ముందు స్థితి ‘పరా’. విత్తనం భూమిలో పడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్న స్థితి లాంటిది ఇది. విత్తులోనుంచి మొలక బయటకు వచ్చే స్థితి. మొక్క పెరిగి వృక్షం కావడం ‘మధ్యమ’ స్థితి. పూత పూయడం, కాయలు కాయడం వైఖరి స్థితి. అన్వయానికి అనుకూలమైన పదాల కూర్పు వల్ల వాక్యాలు ఏర్పడుతున్నాయి.
కవుల వాక్కులు చమత్కారానికి నెలవులు. గణపతిని వ్యతిరేకిం చేవారిని గురించి ఒక ఆధునిక కవి ఒకే వాక్యంలో ఇలా పేర్కొన్నాడు. ‘పార్వతీబాయి ముద్దులబ్బాయి చేయి ఇడుము లందించి కలుములందించు గాక’ (కష్టాలను పోగొట్టి సంపదలను ఇవ్వాలి/ కష్టాలను ఇచ్చి సంపదలను పోగొట్టాలి) చమ త్కారంగా ఉండే ఇలాంటి కవితలెన్నో ప్రచారంలో ఉన్నాయి. వాల్మీకి, కాళిదాసాది కవుల వాక్కులకు గొప్ప శక్తి ఉన్నట్లు గాథలు ఉన్నాయి.
వేదవాక్కుకు ఉన్న ప్రామాణికత ఎప్పుడూ నిరూపితం అవుతూనే ఉంటుంది. ఆమధ్య శ్రీరామ జన్మ భూమి విషయంలో ఇది తేటతెల్లం అయింది. ఉన్నత న్యాయస్థానంలో వాదప్రతివాదాలు తీవ్రంగా జరిగాయి. ‘శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడని ఏ ప్రామాణిక గ్రంథంలోనైనా ఆధారం ఉన్నదా?’ అని న్యాయాధిపతి సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఏ గ్రంథం పేరు చెప్పినా అది ప్రామాణికం కాదనే అవకాశం ఉంటుంది. ప్రముఖ న్యాయవాది పరాశరన్ రామజన్మభూమి ట్రస్ట్ పక్షాన వాదిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పగలరు? ‘ఉన్నది! ఆధారం ఉన్నది!’ అని ఒక గొంతు పలికింది. అందరూ అటువైపు చూశారు. ‘రుగ్వేదంలో ఉన్నది!’ అని ఆ వ్యక్తి సంహిత సహితంగా పూర్తి వివరాలు చెప్పారు. న్యాయాధిపతి వెంటనే రుగ్వేద ప్రతిని తెప్పించి, ఆ వ్యక్తి చెప్పిన పుటలో ఉన్న విషయం చదివారు. సరయూనదీ తీరంలో రాముడి జన్మభూమి ఉన్నదని అక్కడున్నది. వేదవాక్కుకు తిరుగులేదు! ఇంతకీ... ఆ వేదవాక్కు విషయం చెప్పిన వ్యక్తి అంధుడు. పేరు రామభద్రాచార్య. పద్మ విభూషణ్ గౌరవాన్ని పొందారు. ఆయన పేరుతో ఒక విశ్వవిద్యాలయమే నడుస్తున్నది! చిన్నప్పటి నుంచి తండ్రి వేదాలు పఠిస్తూ ఉండగా విని మొత్తం కంఠస్థం చేసుకున్న రామభద్రాచార్యకు ఇది చిన్న విషయమే కావచ్చు గాని, దేశచరిత్రలో గుర్తుంచుకోదగిన పెద్ద అంశంగా మిగిలింది!
మానవ జీవితం సంఘర్షణ మయం.ఆత్మబల సంపన్నులకు విజయం తథ్యం. వీరి ఆయుధం సత్యవాక్కు. ఈశ్వరుడు మానవుడిని దీనుడిగానో, హీనుడిగానో సృష్టించలేదు. మహోన్నతమైన మాటలాడే శక్తిని సైతం ప్రసాదించాడు. వాక్కు గొప్ప సంపద. అది సంస్కారయుతంగా ఉండాలి. ఈ సంపదను సద్వినియోగపరచుకున్న వారే ధన్యాత్ములు.
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే...
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!