అమలిన వ్యక్తిత్వాలు
వ్యక్తిత్వ వికాసం- ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత అధ్యయనాంశాల్లో ఒకటి. దానికోసం ప్రత్యేక గ్రంథాలు, అధ్యయనాలు, అధ్యాపకులు అవసరమే. కానీ త్రికాలజ్ఞులైన మన ఋషులు, జ్ఞానులు భావితరాలకోసం ఎన్నో గ్రంథాలు రాసి పెట్టారు.
వ్యక్తిత్వ వికాసం- ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత అధ్యయనాంశాల్లో ఒకటి. దానికోసం ప్రత్యేక గ్రంథాలు, అధ్యయనాలు, అధ్యాపకులు అవసరమే. కానీ త్రికాలజ్ఞులైన మన ఋషులు, జ్ఞానులు భావితరాలకోసం ఎన్నో గ్రంథాలు రాసి పెట్టారు. ఎన్నెన్నో ఉత్కృష్ట వ్యక్తిత్వాలను మన కళ్లముందు నిలబెట్టారు. పురాణాలు, చరిత్ర, జీవిత చరిత్రలు... వాటన్నింటికీ ఆధారం- నాటి వ్యక్తులు జీవించి చూపించిన విధానం, విజ్ఞానం, అనుసరించిన వ్యక్తిత్వ వికాసమే.
ఒక రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, హరిశ్చంద్రుడు, శిబి చక్రవర్తి, గాంధీ, సీత, కుంతి, ద్రౌపది, రామకృష్ణులు, వివేకానందుడు... ఎందరో! వాళ్లు పాఠాలు చెప్పలేదు. పుస్తకాలు రాయలేదు. వారి జీవితమే ఒక ఆదర్శం, ఒక శాస్త్రం, ఒక నిఘంటువు. వారు ఆదర్శం కోసమో, ప్రాచుర్యం కోసమో అలా జీవించలేదు కాబట్టే మనకు ఆదర్శం అయ్యారు. ఆచరణీయులయ్యారు. రాముడు, కృష్ణుడు... మానవులే. కాకపోతే మానవ శ్రేష్ఠులు. వారి జీవితమే ఒక వ్యక్తిత్వ వికాసం.
మానవుడు ఎలా జీవించాలో పరిపూర్ణంగా జీవించి చూపినవాడు రాముడు. ఇది అమాయక లోకం కాబట్టి నిజాయతీతో కూడిన సహజమైన ఆచరణ మనకు విడ్డూరంగా, ఉత్తమోత్తమంగా ఉంది. నిజానికి ప్రతి మనిషీ ఆచరించాల్సిన విధానం అది. విధి అది. అది ఆచరించాడు కాబట్టే రాముడు ఆదర్శప్రాయుడయ్యాడు. అపురూప మానవుడయ్యాడు. సాక్షాత్ రామచంద్రుడయ్యాడు. మిత్రుడిగా, పుత్రుడిగా, సోదరుడిగా, శిష్యుడిగా, రాజుగా, భక్తుడిగా జీవితంలోని ప్రతి పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్రతి దశనూ పరిపూర్ణంగా, అత్యంత సహజంగా పోషించిన పురుషశ్రేష్ఠుడాయన. అందుకే ఒక రాజకుమారుడు, ఒక మామూలు మానవుడు... దేవుడయ్యాడు!
శ్రీకృష్ణుడు... పరిపూర్ణ అవతారం. సహజావతారం. బాలుడిగా ఆ చిలిపి పనులు, ఆ అల్లరి, పాలు- వెన్నల దొంగతనాలు, గోపికల వస్త్రాపహరణం, గోవర్ధనగిరినెత్తడం వంటివి సహజ బాల్యావస్థకు నిదర్శనం. బృందావనంలో రాసలీల, ఆ తరవాత రుక్మిణీ కల్యాణం, కంస మర్దనం, యౌవనావస్థకు నిలువుటద్దాలు. ప్రౌఢ వయసులో శత్రు సంహారాలు, ఆపన్నుల రక్షణ, ధర్మ రక్షణ, గీతావిష్కరణ... మనం ఏ అంశాన్ని, ఏ దశలోని కృష్ణుణ్ని తీసుకున్నా మనకు దిశా సూచకంగానే, దిశా నిర్దేశంగానే ఉంటుంది. ఆదర్శప్రాయంగానే ఉంటుంది.
ఇక సత్యపాలనకు సత్యహరిశ్చంద్రుడు, దేశభక్తికి మహాత్మాగాంధీ, భగత్సింగ్, రాణీ రుద్రమ, లక్ష్మీబాయి, అల్లూరి తదితరులు... ఆధ్యాత్మిక అనుసరణకు, ధర్మోద్ధరణకు రామకృష్ణులు, వివేకానందులు మనకు కాగడా ఎత్తి చూపిస్తున్న ఆదర్శప్రాయులు. ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఏం కోల్పోవలసి వచ్చినా ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో ఎలా జీవితాన్ని నిభాయించాలో చెప్పకనే చెప్పిన సీత, కుంతి, ద్రౌపది, శారదా మాత- ప్రాతఃస్మరణీయులు.
అద్భుత గ్రంథరాజం భగవద్గీత. ‘గీతే లేకపోయివుంటే ప్రపంచ వాఙ్మయం పరిపూర్ణం అయ్యేదే కాదు. పరిపుష్టం అయ్యేదే కాదు’ అంటూ ప్రపంచ మేధావులు, జ్ఞానులు వేనోళ్ల శ్లాఘించారు. అదీ వ్యకిత్వ వికాస సౌరభం, వైభవం! ఇంతకంటే మనకు మరో వ్యక్తిత్వ వికాస శిక్షణ అవసరమా?
- చక్కిలం విజయలక్ష్మి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ