నిశ్చల నదీప్రవాహం
నదులు నేలతల్లి కంఠసీమను అలంకరించే మణిహారాలు. కంఠహారాలు తిన్నగా ఉండవు. ఒంపుల సొంపులు వాటి ప్రత్యేకత. జీవనదులు సైతం అలా ఉన్నప్పుడే వాటి అస్తిత్వం శోభిల్లుతుంది. అడ్డు వచ్చే రాళ్లను రప్పలను దాటుకుంటూ వెళ్ళవలసిన నది నిశ్చల ప్రవాహం కోరుకోదు.
నదులు నేలతల్లి కంఠసీమను అలంకరించే మణిహారాలు. కంఠహారాలు తిన్నగా ఉండవు. ఒంపుల సొంపులు వాటి ప్రత్యేకత. జీవనదులు సైతం అలా ఉన్నప్పుడే వాటి అస్తిత్వం శోభిల్లుతుంది. అడ్డు వచ్చే రాళ్లను రప్పలను దాటుకుంటూ వెళ్ళవలసిన నది నిశ్చల ప్రవాహం కోరుకోదు. కానీ మనిషి నిశ్చల నదీప్రవాహంలా తన జీవితం సాగాలని కోరుకుంటాడు.అత్యాశ కదూ? కాదంటారు విమర్శకులు. నదీప్రయాణంలో ఎదురయ్యే కొండలు, జలపాతాల్లా ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ ఒడుదొడుకులు ఎదురవుతాయి. నావకు సరంగు దర్శకత్వం తోడ్పడితే, సాధకుడికి సద్గురువు దార్శనికత దారి చూపుతుంది.
అసంఖ్యాక జీవులు ప్రకృతి బడిలో పాఠాలు నేర్చుకుంటాయి. జీవికను తదనుగుణంగా మలచుకుంటాయి. మానవుడు ప్రకృతికి చేరువగా జీవించవలసి ఉన్నా వైజ్ఞానికంగా ఆలోచించగల మేధ కారణంగా అసహజమైన కర్మలు చేస్తాడు. అపరిపక్వ కర్మలే అతడి కష్టసుఖాలకు కారణమవుతాయి. జంతువులు వాటి ప్రకృతికి భిన్నంగా కర్మలు చేయవు. తప్పులు చేయవు.
నిశ్చల నదీప్రవాహంలో పడవ ప్రయాణం లాంటి బతుకును మనిషి కోరుకుంటాడు. మరే ప్రాణీ అలా కోరుకోదు. అందుకేనేమో మానవ జీవితం ఒడుదొడుకులు, సుఖసంతోషాల మేలు కలయికగా సాగుతుంది.
మానవ జన్మ ఉదాత్తమైనది. మనిషి మస్తిష్కంలో సమస్త ప్రపంచమూ ఇమిడి ఉంది. సప్తస ముద్రాలు, అంతరిక్షం, వైవిధ్యభరిత ప్రకృతి, పరమ పావనమూర్తి భగవంతుడు అందులో కొలువై ఉన్నారు. పాహిమాం అంటూ ఆర్తిగా పిలిస్తే దైవం భక్తుడి అంతఃకరణలో కనిపిస్తాడు. ప్రాణ రూపంలో శివుడు అలరారగా దేహం నుంచి ఆయన నిష్క్రమించిన మరుక్షణం అదొక చెత్త మూట అవుతుంది. ‘నారాయణ! హరినారాయణ!’ అని కీర్తించి ఉత్తమ గతులు పొందాలని ప్రబోధిస్తారు పండితులు. మానవ దేహధారణ జననమరణ చక్రం నుంచి బయటపడే నిమిత్తం దైవం అనుగ్రహించిన మహదవకాశంగా భావించాలంటారు మహాత్ములు.
సనాతన ధర్మంలో పరమాత్మ బహురూపధారణ కొందరిలో ఏ దేవతను ఆరాధించాలనే సందిగ్ధతకు దారి తీయవచ్చు. ఓ వ్యక్తి ప్రవర్తన... సన్నివేశం ఒకటే అయినా, భిన్న సందర్భాల్లో వేర్వేరుగా ఉండవచ్చు. అందుకు అతడి మనఃస్థితిలోని అస్థిరతే కారణం. సత్యం మారదు. స్థిరంగానే ఉంటుంది. లోకాలనేలే పరమాత్మ అనేక రూపాల కారణంగా సంశయానికి లోనుకాకుండా నచ్చిన స్వరూపాన్ని పూజించవచ్చునంటారు పండితులు.ఏ రూపంలో కొలిచినా అన్ని ప్రార్థనలు, పూజలు ఆయనకే చెందుతాయి. తన నుంచే అనేక దేవతల మంగళ కరమైన దీవెనలు భక్తులకు అందుతాయంటాడు శ్రీకృష్ణ భగవానుడు.
జీవితంలో మనిషిని అనుభవాల రూపంలో పలకరించే కఠోర పరిస్థితులను అతడు అంగీకరించాలంటారు మనోవైజ్ఞానికులు. అలా చేయగల సాధనమే ఆధ్యాత్మికం అన్న సత్యాన్ని మరవకూడదు.అదే సాధనలో కీలకాంశం. తప్పని పరిస్థితిని అంగీకరించినప్పుడు మార్పు చేయలేని ఆ అంశాన్ని మనసు జీర్ణించుకొని స్థైర్యాన్ని పొందుతుంది. రూపసహిత దేవతారాధన కానీ రూపరహిత ప్రార్థన కానీ సాధకుడి జీవితం సాఫీగా సాగేలా చేయగలదన్నది విజ్ఞాన శాస్త్రం అంగీకరించిన సత్యం. ఆ సత్యాన్ని గుర్తిస్తే తన జీవితం ఒడుదొడుకులు లేకుండా ఆనందమయ తీరాలకు చేరుకోగలదని సాధకుడు గ్రహిస్తాడు.
- గోపాలుని రఘుపతిరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ