అమ్మకు అభినందనం!
అమ్మ కనిపించే దేవతే కాదు. కని, పెంచే దేవత! అమ్మంటే అంతులేని అనురాగం. మాసిపోని మమకారం. ‘గర్భాన్ని ధరించింది మొదలు, తన బిడ్డలు సంపూర్ణ విద్యలతో శోభిల్లేవరకు వారికి సౌశీల్యాన్ని, సంస్కారాన్ని, సుగుణాల్ని
అమ్మ కనిపించే దేవతే కాదు. కని, పెంచే దేవత! అమ్మంటే అంతులేని అనురాగం. మాసిపోని మమకారం. ‘గర్భాన్ని ధరించింది మొదలు, తన బిడ్డలు సంపూర్ణ విద్యలతో శోభిల్లేవరకు వారికి సౌశీల్యాన్ని, సంస్కారాన్ని, సుగుణాల్ని బోధించే తల్లి ఎంతో ధన్యురాలు... సృష్టికారకత్వానికి ఆమె చేవ్రాలు!’ అని వేదం అమ్మ ఔన్నత్యాన్ని కీర్తించింది. సకల జగత్తూ పురోగమించడానికి, జ్ఞానయుతంగా వర్ధిల్లడానికి మూలకారక శక్తి- మాతృమూర్తి! అందుకే అమ్మను మించిన ధర్మం లేదని ఆదిశంకరులు స్పష్టం చేశారు. ‘జనని’ అనే మాటే మంత్రపునీతం. జ్ఞానధాత్రి, దివ్య జనయిత్రి, మధుర హృదయనేత్రిగా అమ్మ స్థానం నిరుపమానం.
మాతృమూర్తులు సంతాన నిర్మాతలు. బిడ్డల భాగ్య నిర్ణేతలు. వారి తలరాతల్ని నిర్దేశించే విధాతలు. అన్నిచోట్లా తానే ఉండలేక, దైవం తన బదులు అమ్మలను సృష్టించాడని లోకోక్తి! అయితే పరమాత్మకన్నా మిన్న అమ్మ. జీవకోటికి మాతృస్థానమే అసలైన ఆలంబన. మోక్ష సాధనామార్గంలో ఎన్నో సోపానాలు ఉన్నాయి. స్వర్గారోహణం చేయాలంటే ఇహంలో ఎంతో పుణ్యకర్మ ఆచరించాలి. ఆ మోక్షం, ఆ స్వర్గం రెండూ అమ్మ పాదాల చెంతనే ఉంటాయి. అమ్మ పాదాల్ని భక్తిశ్రద్ధలతో సేవిస్తూ, బిడ్డలుగా ఆమె మనసు గెలుచుకుంటే చాలు. స్వర్గమే ఇలపైన వాలు! ఆ నేపథ్యంలోనే ‘మాతృదేవోభవ’ అని వేదం అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది.
అమ్మఒడి బిడ్డలకు ప్రథమ బడి. ఎవరి జీవితానికైనా అమ్మ మార్గదర్శి. అమ్మే దారిదీపం, దిక్సూచి. తన బిడ్డల మూర్తిమత్వ నిర్మాణంలో అమ్మ కీలక భూమిక పోషిస్తుంది. వారిని సమాజం ముందు బాధ్యతాయుతమైన పౌరులుగా నిలబెట్టడానికి అమ్మ విధ్యుక్తంగా కొన్ని ధర్మాలు నిర్వహిస్తుందని ఉపనిషత్తులు ప్రతిపాదించాయి. అవి ధ్వస్తి, ప్రాప్తి, శక్తి, ప్రశస్తి, స్వస్తి. ఈ పంచధర్మాల ప్రాతిపదికన అమ్మ తన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. బిడ్డల మనోకాలుష్యాల్ని దూరం చేయడం, వారిని ధర్మమార్గం వైపు పయనింపజేయడం, సర్వసమర్థులుగా వారిని తయారుచేయడం, అందరి అభిమానాన్ని పొందేలా గుణసంపన్నులుగా వారిని తీర్చిదిద్దడం, ప్రతికూల భావాలు, దురలవాట్ల నుంచి వారిని దూరం చేసి సంపూర్ణ వ్యక్తులుగా ఆవిష్కరించడం... ఈ అయిదు ప్రక్రియల్ని మాతృమూర్తులు నిర్వహించడం ద్వారా సమాజంలో సర్వదా సౌమనస్య భావాలు పరివ్యాప్తమవుతాయని ఆర్ష ధర్మం ఆకాంక్షించింది.
మాతృమూర్తి ‘గర్భాలయం’లో అణువుగా, అంకురంగా, చిరుదివ్వెగా ఊపిరి పోసుకుని, నవమాసాలు ఉమ్మనీరు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేసి శిశువుగా లోకంలోకి బిడ్డ అడుగిడుతుంది. అందుకే జననిని లోకపావనిగా పద్మపురాణం కీర్తించింది. అమ్మంటే జీవశక్తిని అందించే ప్రాణవాయువు. జరామరణాలకు అతీతమైన ప్రేమ ఆయువు! సతత హరితార్ణవంగా శోభిల్లే మాతృనందన వనంలో, తన బిడ్డలందరూ సదా ఆనందాతిరేకాలతో వర్ధిల్లాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది.
కౌసల్యా మాత అందించిన శుభ దీవెనలే ధర్మమార్గం వైపు నడిపిస్తున్నాయని శ్రీరాముడు పలికాడు. దేవకి తేజస్సు, యశోదమ్మ యశస్సు తన శక్తియుక్తులకు కారణమని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. అనసూయమ్మ అనుగ్రహమే తన అవతార పరమార్థమని దత్తాత్రేయుడు ప్రవచించాడు. ఈ అన్నింటికీ అమ్మ ఆశీర్వాదమే మూలం! యుగపురుషులకే కాదు, బిడ్డలందరికీ అమ్మ అందించే అనంతమైన ఆలంబన, ఆత్మవిశ్వాసం, జీవన గమనంలో పురోగమించడానికి ఉపయుక్తమవుతాయి. బిడ్డల మస్తకాల్ని అమేయమైన చైతన్యంతో నింపే ప్రేమపుస్తకం- అమ్మ!
- విద్వత్ శ్రీనిధి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?