శాస్త్ర జ్ఞానం
మంచి స్వభావం, ఉత్తమ నడవడిక, మార్గదర్శనం మనకు శాస్త్రాల నుంచి లభిస్తుంది. శాస్త్రాలు తల్లి వంటివి, ఆ పరమాత్మ శాస్త్రాలకు తండ్రివంటి వాడని చెబుతారు పండితులు.శాస్త్రం ఎప్పుడూ ప్రామాణికమే. శాస్త్ర జ్ఞానం ప్రతి మనిషికీ ...
మంచి స్వభావం, ఉత్తమ నడవడిక, మార్గదర్శనం మనకు శాస్త్రాల నుంచి లభిస్తుంది. శాస్త్రాలు తల్లి వంటివి, ఆ పరమాత్మ శాస్త్రాలకు తండ్రివంటి వాడని చెబుతారు పండితులు.
శాస్త్రం ఎప్పుడూ ప్రామాణికమే. శాస్త్ర జ్ఞానం ప్రతి మనిషికీ ఉండి తీరాలని పెద్దల మాట. కాని ఆ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అప్పుడు శాస్త్ర జ్ఞానం గల గురువుల నుంచి ప్రతి ఒక్కరూ తమ సందేహాలు తీర్చుకోవాలి.
వేద, వేదాంగ, వేదాంత రహస్యాలు తెలుసుకోగల అదృష్టం కొంతమందికి మాత్రమే లభిస్తుంది. దీపం నుంచి దీపం వెలిగించినట్లుగా వారు ఆ జ్ఞానాన్ని అందరికీ అందజేయాలి. తద్వారా, సమాజంలో అజ్ఞానం క్రమంగా అంతరిస్తుంది. శాంతి నెలకొంటుంది.
ఉత్తమ గ్రంథాలను శ్రద్ధాసక్తులు లేకుండా కాలక్షేపానికి ఎంతమాత్రం చదవకూడదు. దానివల్ల ఆశించిన ప్రయోజనం పొందలేం. ఎందుకంటే, ఆహారాన్ని చూస్తే ఆకలి తీరదు. ఆరగిస్తేనే రుచి తెలుస్తుంది. శక్తి లభిస్తుంది. శాస్త్ర అధ్యయనం అటువంటిదే. శాస్త్రాలను భక్తితో, శ్రద్ధతో అధ్యయనం చేయాలి. అప్పుడే మనోవికాసం కలుగుతుంది. మనసు ధార్మికత్వం వైపు ప్రయాణిస్తుంది.
ప్రపంచంలో ఏ దేశానికీ లభించని గొప్ప వరం మన భారతదేశానికి లభించింది. అదే వేద వాఙ్మయం. వేద శబ్దానికి అర్థం విజ్ఞానం. సార్వజనీనమైన జ్ఞాన సంపదను మహర్షులు మనకు అందించారు. మనమందరం సూర్యచంద్రులు లాగా సన్మార్గంలో నడుద్దామని బోధిస్తోంది వేదం.
ఆదికావ్యమైన రామాయణం సనాతన ధర్మానికి,నైతిక విలువలకు నిలువెత్తు ప్రతీకలా నిలిచి నిత్యజీవితంలో మనిషి ఎలా నడుచుకోవాలో చెబుతుంది. పితృ ధర్మానికి, ఏకపత్నీ వ్రతానికి, సోదర ప్రేమకు, స్నేహ ధర్మానికి, శరణాగత రక్షణకు నిర్వచనం శ్రీరాముడు. ధర్మమార్గంలో నడవాలని, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు రాముడు. అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.
మహాభారత సందేశాలన్నీ అమూల్యమైనవి. సర్వ కాలాలకు, సమయాలకు వర్తించేవి. నీకు కష్టం కలిగించే పని ఇతరుల పట్ల చేయవద్దని చెబుతోంది భారతం. భారతంలో లేనిది మరింకెక్కడా లేదంటారు. అందుకే అది పంచమ వేదమైంది.
నీ కర్తవ్యాన్ని నీవు సక్రమంగా నెరవేర్చు, కర్తవ్య దీక్షలో పిరికితనం పనికిరాదంటుంది భగవద్గీత. ఇలా ప్రతి శాస్త్రం- ధర్మమే జయిస్తుంది, అధర్మం అపజయం పాలవుతుందన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది. సత్యం, ప్రేమ, ధర్మం వంటివి పాటించమని, సన్మార్గంలో నడవమని బోధించింది.
శాస్త్ర జ్ఞానం మనిషిని మనీషిగా, దానవుణ్ని దైవంగా, భోగిని యోగిగా, రాగిని విరాగిగా మార్చి అలౌకికానంద ప్రాప్తి కలిగిస్తుంది.
ఈ లోకంలో ఏ సంపదైనా తరిగిపోవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మాత్రం ఎన్నటికీ తరిగిపోదు. మానవుణ్ని మాధవుడిగా మార్చే ఈ శాస్త్రాలను ఆకళింపు చేసుకుని, వాటిని మన జీవన సంవిధాన ప్రక్రియకు సమన్వయం చేసుకోవాలి. అంతేకాకుండా, శాస్త్రాలలో ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని పదిమందికీ పంచాలి. ఇదే జ్ఞానయజ్ఞం. ఇదే శ్రేష్ఠమైన యజ్ఞం. అది నిర్వర్తించినవారికి భగవంతుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది.
- విశ్వనాథ రమ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు. -
అనుభవ సారం
జీవితం ప్రతీ క్షణం ఒక అనుభవమే. అటువంటి అనుభవాలే జ్ఞాపకాలుగా కాలక్రమంలో పాఠాలను చెబుతాయి. జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. కానీ ఎల్లకాలం ఒకే రకమైన అనుభవాలుంటే మాత్రం విసుగు పుట్టిస్తాయి. అప్పుడు జీవితం నిస్తేజంగా తయారవుతుంది. అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకునే ఉద్దేశంతో, గాలి మార్పు పేరుతో వేరువేరు ప్రదేశాలను పర్యటించమని పెద్దలు చెబుతారు. -
సిలువపై సత్య సందేశం
ఒక బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్