పంచమవేదం
మహాభారతానికి వేదవ్యాసుడు తొలుత నిర్దేశించిన పేరు ‘జయం’. వ్యాసమహర్షి శిష్యులను ఆశ్వలాయన గుహ్య సూత్రాలు- ‘భారత మహాభారత ఆచార్యులు’గా అభివర్ణించాయి. అంటే వ్యాసశిష్యుల మూలంగా జయం- భారతంగా మహాభారతంగా...
మహాభారతానికి వేదవ్యాసుడు తొలుత నిర్దేశించిన పేరు ‘జయం’. వ్యాసమహర్షి శిష్యులను ఆశ్వలాయన గుహ్య సూత్రాలు- ‘భారత మహాభారత ఆచార్యులు’గా అభివర్ణించాయి. అంటే వ్యాసశిష్యుల మూలంగా జయం- భారతంగా మహాభారతంగా ఆవిర్భవించిందని అర్థం. ఆ క్రమంలో సంస్కృత భారతం లక్షా అయిదు వందల శ్లోకాలుగా విస్తరించింది. ఆదిపర్వంలోని పర్వానుక్రమణికలో ఇది నన్నయభట్టు వెల్లడించిన లెక్క.
వ్యాసమహర్షి జయ కావ్య రచనను లోక హితం కోరి ప్రచారం చేసే బాధ్యతను శిష్యులు, మునులు స్వీకరించారు. నారదుడు దేవలోకంలోను, దేవలుడు పితృలోకాల్లోను, జనమేజయుడికి భారతాన్ని వివరించే క్రమంలో వైశంపాయన మహర్షి మానవ లోకంలోనూ- వ్యాసకృతికి లోకోత్తర ప్రాచుర్యాన్ని చేకూర్చారు. వైశంపాయనుడు చెబుతున్న సమ యంలో ఉగ్రశ్రవసుడు అనే సూతుడు ఆ కథను విన్నాడు. ఆయన ఆ కాలంలో సుప్రసిద్ధ పౌరాణికుడు. నైమిశారణ్యంలో పన్నెండు సంవత్సరాల పాటు శౌనక మహర్షి సత్త్రయాగాన్ని నిర్వహించిన సందర్భంలో అక్కడి మునుల కోరికపై అదే సూతమహర్షి భార తాన్ని వినిపించాడు. ఆ సమయంలో శ్రోతలకు కలిగిన సందేహాలకు, లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ సూతుడు- వ్యాస హృదయాన్ని మరింత స్పష్టంగా ఆవిష్కరిం చేందుకై కొన్ని వివరణలు జోడిం చాడు. ఇలా ఒకరితో ఒకరు అనగా అనగా... విస్తరించిన బృహత్ గ్రంథమే ఇప్పుడు మనముందున్న మహాభారతం. చిన్నప్పుడు మనం విన్నకథలన్నీ ‘అనగనగా...’ అంటూ ఆరంభమయ్యే అద్భుతమైన సంప్రదాయంలోని అసలు రహస్యం ఇదే!
ఆద్యంతం కొనసాగే అసలైన కథకు ఆఖ్యానం అని పేరు. దాన్ని మరింతగా తేటతెల్లం చేసేందుకు అనుబంధంగా అల్లుకొనే కథలను ‘ఉపాఖ్యానాలు’ అంటారు. ఉపాఖ్యానాలు హుందాగా ఔచిత్యభరితంగా ఉండాలన్నాడు జగన్నాథ పండితరాయలు. అందమైన విషయాన్ని చెబుతూ, మధ్యలో అసలు కథకు పరిపోషకంగా వేరే సంగతులను ఎంతో నైపుణ్యంగా పొదిగి శ్రోత దృష్టిని ఆకట్టుకొనే క్రమాన్ని ఆయన ‘గుణీభూత వ్యంగ్య కావ్యప్రకారం’ అంటూ నిర్వచించాడు. అలాంటి ఉటంకింపులు ఉదాహరణలు అనుచరుల ఇంట శుభకార్యానికి తరలివచ్చిన రాజువలె దర్జాగా ఉండాలని ఆ ముంగండ పండితుడి తీర్మానం. అవి పాలు, పంచదారలా కలగలిసిపోవాలని తాత్పర్యం.
వేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు పురాణాలు... వంటి వేదధర్మాన్ని విపులీకరించే సాహితీశాఖలు- జయకావ్యానికి ఎంతో ముందువే. వాటి సారాంశాన్ని మనం ఇప్పుడు చెప్పుకొంటున్న ‘పాఠకమిత్ర’ వ్యాఖ్యాన రూపంలో, ఒక ఇతిహాసంగా రూపొందించే కర్తవ్యాన్ని వ్యాసమహర్షి చేపట్టారు. అది జయకావ్యం. దాన్ని ఆయా కాలాల్లోని ప్రజలకు చేరువ చేసే విధంగా, ధార్మిక జీవనసూత్రాలను అనుసంధానిస్తూ, మనుగడను మంగళకరంగా మలచే దిశగా వ్యాసశిష్యులు- జయకావ్యాన్ని భారతంగా, మహాభారతంగా తీర్చిదిద్దారు. అది ఆనాటి యుగధర్మం. కాలానుగుణమైన ధర్మ సమన్వయాలు- యుగావసరాలు. విశ్వశ్రేయస్సు పరమలక్ష్యంగా వేదాల సారాంశం ఇలా క్రమంగా ధార్మిక విశ్వరూపాన్ని సంతరించుకొన్న ఇతిహాసం కాబట్టి- మహాభారతానికి ‘పంచమవేదం’ అనే ఖ్యాతి వచ్చింది. ఇంతకాలంగా జ్ఞానదీపమై వికాసాన్ని పంచుతూ వస్తోంది. పంచుతూనే ఉంటుంది!
- ఎర్రాప్రగడ రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!