భగవద్దాసు రామదాసు
తారక మంత్రంలోని రుచిని ఆస్వాదించి, అందరికీ పంచిన భక్త శిఖామణి కంచర్ల గోపన్న. ఇతడు రాముడికి పరమ భక్తుడు. అందువల్ల రామదాసుగా ప్రసిద్ధుడయ్యాడు. పూజా పునస్కారాలు లేకుండా భద్రగిరి మీద ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలకు ఈయన కోవెల, ప్రాకారాలు లాంటివన్నీ కట్టించాడు. ఆ సమయంలో ఆయన భద్రాచలం తహసీల్దారుగా పనిచేసేవాడు.
తారక మంత్రంలోని రుచిని ఆస్వాదించి, అందరికీ పంచిన భక్త శిఖామణి కంచర్ల గోపన్న. ఇతడు రాముడికి పరమ భక్తుడు. అందువల్ల రామదాసుగా ప్రసిద్ధుడయ్యాడు. పూజా పునస్కారాలు లేకుండా భద్రగిరి మీద ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలకు ఈయన కోవెల, ప్రాకారాలు లాంటివన్నీ కట్టించాడు. ఆ సమయంలో ఆయన భద్రాచలం తహసీల్దారుగా పనిచేసేవాడు.
బాల్యంలోనే గోపన్న మనసులో రామభక్తి పాదుకొంది. అప్పుడే ‘ఏల పుట్టకపోతి ఆనాడే రాముల తోడు’ అని సంకీర్తనలు చేయడం ప్రారంభించాడట.
ఎప్పుడూ భజన గోష్ఠులతోనూ, భాగవత సత్కారాలు చేస్తూ కాలం గడిపేవాడు గోపన్న. కబీరుదాసు అతడి దగ్గరకే వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశించాడని ప్రచారంలో ఉన్న కథ. ఆ సందర్భంలోనే గోపన్న ‘తారకమంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా’ అనే కీర్తన రచించాడు. ఉన్న సంపాదనను హరిదాసులకు ఇచ్చేసి కట్టుబట్టలతో మేనమామలైన అక్కన్న, మాదన్నల సహాయంతో భద్రాచలానికి ఉద్యోగంలో చేరడానికి వెళ్ళిపోయాడు.
రాజద్రవ్య అక్రమ వినియోగ నేరంతో చెరసాల పాలయ్యాడు రామదాసు. ఆ సందర్భంలో ‘ఏటికి దయ రాదు’ అనే కీర్తనలో ‘పన్నెండేండ్లాయెనే శ్రీరాములు బందిఖానాలో యున్నాను’ అని పాడుకొన్నాడట.
ప్రపంచమంతా రామమయంగానే భావించాడాయన. ఆ విషయాన్ని ఉదాహరణలతో తన కీర్తనలలో పొందుపరిచాడు. ‘అంతా రామ మయం, ఈ జగమంతా రామ మయం’ అనే కీర్తనలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ‘రాముడు మనకు అండగా ఉంటే మనకు తక్కువేమిటి?’ అనే గాఢ విశ్వాసాన్ని ‘తక్కువేమి మనకూ రాముండొక్కడుండు వరకూ’ అనే కీర్తనలో చెప్పాడు. ‘రాముని వారము మాకేల విచారము’ అనే కీర్తనలో ‘రాముడు తోడుండగా మనకెందుకు విచారం’ అను కుంటూ తన భక్తిని, ఆయన పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. దొంగల బాధ నుంచి తప్పించమని రాముణ్ని వేడుకుంటూ ‘క్రమ్ముకొని శత్రువులు హమ్మనుచు వచ్చెదరు. ఒమ్మైన బాణములిమ్మ రావ! ప్రభో పాహి రామప్రభో’ అని వేడుకుంటూ కీర్తించాడు.
రామదాసు రచనలుగా గుర్తుపట్టగలిగిన కీర్తనలు 108 వరకు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటి సంగీత సరళి స్పష్టమైన భావస్ఫురణతో సామాన్య జనానికీ అందుబాటులో ఉండేటంత సుగమంగా ఉంటుంది. ఆనందబైరవి రాగంలో కీర్తనలు చేసిన మొదటి వాగ్గేయకారుడు రామదాసేనని చరిత్ర చెబుతోంది. సంస్కృత కీర్తనలలోనూ రాముణ్ని కీర్తించాడు రామదాసు.
‘ఏ తీరుగ నను దయచూసెదవో’, ‘గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరా’, ‘ఓ రాఘవాయని పిలిచిన ఓహోయనరాదా’ మొదలైన కీర్తనలు ఆర్తితో కూడిన రామదాసు భక్తికి నిదర్శనాలు. అవి భక్తిపూర్వకంగా రాముడి పాదాల చెంత ఉంచిన స్వరపుష్పాలు.
కేవల భక్తి మార్గమే కాకుండా జ్ఞాన మార్గాన్ని తోడు చేసుకొన్న యోగి పుంగవుడు రామదాసు. ‘భళి వైరాగ్యమెంతో బాగైయున్నది చంచలమైన నా మనసు నిశ్చలమై యున్నది’ అనే సైంధవి రాగ కీర్తన దీనికి ఉదాహరణ.
‘పాహిరామ ప్రభో’ అనే కీర్తన రాముడి రూపాన్ని కన్నులలో నింపుకొని రాసినది. ఇలా భక్తి, ఆర్తి, అనురక్తి, నిందాస్తుతులతో ఆ జగదభి రాముణ్ని కీర్తిస్తూ ఆయనలోనే ఐక్యమైన దాసాను దాసుడు రామదాసు.
- గంటి ఉషాబాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిలువపై సత్య సందేశం
ఒక బోధకుడు రాత్రిపూట ఒక అడవి మార్గంలో కాలినడకన ప్రయాణిస్తున్నాడు. ఇంతలో హఠాత్తుగా వచ్చిన ఒక దొంగ ఆ బోధకుడిని అడ్డగించాడు. ‘నీవద్దనున్న సొమ్ము ఇవ్వకపోతే చంపేస్తాను’ అంటూ కత్తి చూపి భయపెట్టాడు. -
ప్రేమే దైవం
ఈ లోకంలో సమస్తాన్నీ కలిపే ఒకే ఒక శక్తి ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. స్వార్థం లేనిది. ద్వేషాన్ని, పశుతత్వాన్ని మనిషి నుంచి తొలగించే దివ్యౌషధం ప్రేమ. అలాంటి ప్రేమ అందరిలో ఉంటే అసమానతలు, ఘర్షణలు, అసూయ, అశాంతి తొలగిపోతాయి. కులమతాలకు అతీతమైన నవసమాజ నిర్మాణానికి కూడా ప్రేమ ఎంతగానో దోహదపడుతుంది. -
నిజ స్వభావం
మనిషి జీవితానికొక పరమార్థం ఉండాలనేవారు శాక్యముని. జీవితానికి అర్థం లేకపోతే బతుకు వ్యర్థమే. నాకెందుకు పుట్టావురా అని కన్నతల్లి ఈసడించుకొనే జీవితం నిరర్థకం. -
శోక పురాణం
పుట్టగానే శిశువు చేసే మొదటి పని ఏడవడం. ‘చిన్నపిల్లలకు ఏడుపే బలం’ అనేది నానుడి. చిన్న వయసులో బాలలకు ఏ ఇతర వ్యాయామాలూ ఉండవు. కాబట్టి ఏడవడం వల్ల అవయవాలు బాగా కదిలి శారీరక వ్యాయామం జరుగుతుంది. -
రంగులహేల... హోలీ!
జీవితం వర్ణమయం. ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది. ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా, హోలీ పర్వంగా సాకారమవుతుంది. వసంత రుతువు అడుగిడే తరుణంలో ప్రకృతి రసాకృతిని ధరిస్తుంది. ఆకుపచ్చని పొదరిళ్లు, పూలపుంతలతో ముస్తాబవుతాయి. ఆమని పేరంటానికి ప్రకృతి నవ వధువై సింగారించుకుంటుంది. ఆ సందర్భంలో విచ్చేసే అందమైన... -
ప్రవచనం
‘విద్వాంసులేమో అసూయాగ్రస్తులు, ప్రభువులా గర్వాంధులు, ఇక సామాన్యులు అజ్ఞానులు. నేను చెప్పదలచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది’ అని వాపోయాడు భర్తృహరి. సుభాషితం అంటే మంచిమాట. మంచి మాటలు వినే సహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన. -
నిలువునా కాల్చేసే ద్వేషం
మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. -
అణువణువునా గురువులే
విద్యాభ్యాసం అంటే గురుముఖతా విద్య నేర్చుకోవడమే అని పలువురి అభిప్రాయం. లౌకికమైన విద్యలు వృత్తి వ్యాపారాల్లో ఉపకరిస్తాయే గాని చదువుల్లోని మర్మాలను వివరించవు. నిశితంగా పరికిస్తే విద్యాలయాల్లో బోధించని విద్యలు జీవిత పాఠాలను చెప్పకనే చెబుతాయి. ఎందరెందరో గురువులు అణువణువునా దర్శనమిస్తారు. -
దేవుడిచ్చిన ఇల్లు
దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. -
జీవనాధార ప్రకృతి
ప్రకృతి- జీవరాశికి మాతృక, సౌందర్యానికి ప్రతీక. మానసికోల్లాసానికి నెలవు, ఖేదపడిన మనసుకు ఓదార్పు. ఉద్వేగానికి నిర్వేదానికి ఉపశమనం, కృత్రిమ జీవితం నుంచి ఆటవిడుపు. ప్రకృతి మనిషిలో జిజ్ఞాస రేకెత్తిస్తుంది. అన్వేషణకు స్ఫూర్తినిస్తుంది. కవులకు కళాకారులకు ప్రేరణ కలిగిస్తుంది. చిత్రంలోని ప్రకృతి కంటినే ఆహ్లాదపరుస్తుంది. -
ఎవరు వామనుడు?
భగవంతుడి అవతార విభూతి రెండు విధాలుగా ఉంటుందన్నారు అరవింద యోగి. మనిషిగా రావాలనుకొంటే- మనిషి ఆకారాన్ని, స్వభావాన్ని తనలో ఆవాహన చేసుకొని మరీ దిగిరావడాన్ని ‘అవరోహణ’ అన్నారాయన. -
మనసుతో మనం కాసేపు...
జీవితం అనుభూతుల నిలయం. అనుభవాల మణిహారం. సమాజంలో వ్యక్తులతో అనుబంధాలు పూల అల్లికలా అందంగా సుగంధ భరితంగా నెలకొల్పుకోవాలి. అందుకు ప్రపంచం అంతా నిండి ఉండే ప్రేమ, శాంతి, మంచితనం తోడ్పడతాయి. -
సుసంస్కారం
నిర్మానుష్య కీకారణ్యాల్లో ఒంటరిగా నివసించే మనిషికి ఎలాంటి సభ్యత, సంస్కారం, మర్యాదలతో పనిలేదు. అదే ప్రదేశానికి మరో వ్యక్తి వచ్చినప్పుడే వాటి అవసరం తెలుస్తుంది. వాటిని పాటించకపోతే ఘర్షణ తలెత్తుతుంది. -
ఊరొక్కటే- దారులెన్నో....
ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాలవారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెదుక్కుంటారు. తెలియకపోతే తోటివాళ్లను వాకబు చేస్తారు. అలా క్షుణ్నంగా తెలుసుకున్న తరవాత నమ్మకం కలుగుతుంది. -
గోవిందం... పరమానందం!
జీవితంలో ప్రతి మనిషీ పరితపించేది ఆనందం కోసమే. అది అంత సులభంగా అందుబాటు అయ్యే సిద్ధాన్నం కాదని తెలుసు. కష్టపడి సాధించినప్పుడే రససిద్ధి కలుగుతుంది. ఆ ఆనందరసాన్ని అనుక్షణం ఆస్వాదించాలని ఆశించడం మానవ సహజం. -
నీకు నీవే సృష్టికర్తవి!
ప్రతీ మనిషిని ఆ భగవంతుడు సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. అందుకే మనిషి స్వయంకృషితో ఏం సాధించాలనుకున్నా, ఏది పొందాలనుకున్నా అది అతడి చేతుల్లోనే ఉంది. మనిషి వేసే ప్రతి అడుగూ అతడి జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. అందువల్ల మనిషి జీవితంలో ఏది జరిగినా అది అతడి ఉన్నతికేనని ప్రతి ఒక్కరూ భావించాలి. -
దైవసన్నిధి
చీకట్లో ఆకాశంవైపు చూసినప్పుడు మనం అశాశ్వతమని గుర్తొస్తుంది. ఎక్కడినుంచి వచ్చామో, మరణం తరవాత ఎక్కడికి వెడతామో తెలియదు. ఇది తీరికలేని జీవితంలో ఒక విరామాన్ని మాత్రం తీసుకొస్తుంది. -
దైవానుగ్రహం
ఆరాధనలతో అల్లాహ్ దాసులు ఆనందించే రోజులు తిరిగివచ్చాయి. రంజాన్ మాసపు నెలవంక ఆకాశవీధిలో మెరవగానే విశ్వాసుల కళ్ళలో సంతోషం విప్పారుతుంది. వెంటనే వారు చేసే దుఆతో ప్రకృతి పరవశిస్తుంది. అనేక భయ ప్రమాదాలు, ఆకలి బాధలు, ధన ప్రాణ, ఆదాయ నష్టాలు చుట్టుముట్టిన ప్రజలకు రక్షగా నిలిచే రంజాన్ పవిత్ర మాసాన్ని అల్లాహ్ తిరిగి అందించాడు. -
సప్త సూత్రాలు
ఆధ్యాత్మిక జీవన వాహిని- అనంతమైన మధుర మనోజ్ఞ తరంగిణి. ఆధ్యాత్మికత అనేది భావన కాదు, జీవన సంవిధానం. చింతనా మార్గంలో ఎవరికివారు సాగించే అలుపెరగని ప్రయాణం. ఆధ్యాత్మిక ధోరణి అంటే కేవలం పూజాది అభిషేకాలకు పరిమితమైంది కాదు. అంతకుమించిన, అవ్యక్తమైన దార్శనిక శక్తి. -
వినయం భూషణం
విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు, వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు.