ఆంజనేయం... మహావీరం!
శ్రీమద్రామాయణంలో రాముడు నాయకుడిగా అన్ని కాండల్లో కనిపిస్తాడు. కాని, రామాయణానికి ఆత్మ సదృశమైన సుందరకాండకు హనుమంతుడే నాయకుడు. రాముడు బాహ్యంగా నరుడే అయినా, అంతర్లీనంగా అనంత పరబ్రహ్మ చైతన్యం.
శ్రీమద్రామాయణంలో రాముడు నాయకుడిగా అన్ని కాండల్లో కనిపిస్తాడు. కాని, రామాయణానికి ఆత్మ సదృశమైన సుందరకాండకు హనుమంతుడే నాయకుడు. రాముడు బాహ్యంగా నరుడే అయినా, అంతర్లీనంగా అనంత పరబ్రహ్మ చైతన్యం. ఆ పరమాత్మను సేవించి, తరించిన వేదమూర్తి- ఆంజనేయుడు! హనుమ అనే పదానికి ఉపనిషదర్థం వేదసారం.
నిరుపమాన భక్తిభావన, నవ నవోన్మేష ఆచరణాత్మక కార్యసాధనకు అంజనానందనుడు ప్రతీక. భక్తి అనే మాట విస్తృతి పొందితే ధర్మం అవుతుంది. ధర్మస్వరూపుడైన రాముణ్ని అనుసరించి భక్తి అనే ధర్మానికి పట్టాభిషేకం చేసిన పావన చరితుడు- హనుమ. మాటలో మంచితనం, పనిలో దృఢసంకల్పంతో అడ్డంకులు అధిగమించి కర్తవ్యమే పరమావధిగా తన మూర్తిమత్వాన్ని పవనాత్మజుడు ప్రతిఫలింపజేశాడు. అకార, ఉకార, మకార సంయోగంతో ఏర్పడిన ‘ఓం’ అనే ఏకాక్షరం పరబ్రహ్మాకృతికి సంకేతం. ఇందులో ‘మ’కారాత్మక రుద్రస్వరూపమే మారుతి- అని పరాశర సంహిత పేర్కొంది. ‘హర’ అనే శివ శబ్దం లోని ‘హ’కారం హనుమ వాచకం, ‘ర’కారం రామ సూచకం. సమస్త దేవతాశక్తులు, సకల దేవగణాల యుక్తుల సమ్మిళిత రూపంగా హనుమను వాల్మీకి దర్శించాడు.
ధర్మకర్తృత్వం, భక్తి భోక్తృత్వం, జ్ఞాన జ్ఞాతృత్వాల మేలుకలయిక హనుమ. బుద్ధి, ధైర్యం, శక్తి, జాగృతి, ఆరోగ్యం, ప్రసన్నత్వం, ప్రళయత్వం, విధేయత అనే అష్ట విధ గుణాల వజ్రాంగ దేహుడు- ఆంజనేయుడు. సర్వేసర్వత్రా పరుల హితం కోసమే పాటుపడి తన జీవితాన్ని ధన్యం చేసుకున్న ఆదర్శమూర్తి- వాయునందనుడు. శ్రీమద్రామాయణం ఉత్తరకాండలో ఆంజనేయుడి సమగ్ర అవతార తత్త్వం గోచరమవుతుంది. ఈశ్వరాంశతో విద్యుల్లతల రాశిగా అంజనకు హనుమ సాకారమయ్యాడు. సూర్యమండలానికి తరలి వెళ్ళి, అఖిల విద్యారూపుడిగా ఆవిష్కారమయ్యాడు. దేవతల వరాల సిరులతో వీరాంజనేయుడిగా విలసిల్లాడు. జితేంద్రియుడిగా అహంకార, మమకారాల్ని పరిత్యజించి ఆనందమయ సుప్రసన్నాంజనేయుడిగా అజేయ పరాక్రమవంతుడిగా ప్రాదుర్భవించాడు.
వైశాఖ బహుళ దశమినాడు అంజన-కేసరి దంపతులకు ఆంజనేయుడు జన్మించాడు. అంజన అంటే అత్యున్నతమైన తపోనిష్ఠ. కేసరి అంటే సర్వశ్రేష్ఠం. సర్వోత్కృష్ట, అత్యున్నత భక్తిసాధనా రీతితో భగవదంశను ప్రతిఫలంగా పొందారు. దశమి తిథి కలిమికి, బలిమికి, చెలిమికి ప్రతీక. మాధవమాసం వైశాఖం. శ్రీరాముడిని తన కలిమితో ప్రసన్నం చేసుకుని, వానరుల చెలిమితో రామకార్యాన్ని సాధించి, తన బలిమిని ప్రదర్శించిన కారణజన్ముడు హనుమంతుడు. వైశాఖంలో వైధృతి యోగంలో విశిష్ట దివ్యగుణాల సమ్మిళితంగా జన్మించిన అనిల కుమారుడు అనితరసాధ్యుడని వానరగీతి కీర్తించింది. పరమాత్మ రాముడి రూపంలో అవతరిస్తే, ఆ పరమాత్మ వైభవాన్ని లోకానికి సాధికారికంగా చాటి చెప్పడానికి వేదసార స్వరూపమే హనుమగా వెల్లివిరిసింది. శబ్ద బ్రహ్మమయమైన వేద హృదయం రామాయణంలో అణువణువునా తొణికిసలాడుతుంది. వేద ధర్మాన్ని ఆచంద్ర తారార్కం నిలిపి ఉంచడానికి హనుమ వేదపురుషుడిగా అవతరించాడు. నిర్మల, నిరంజన, నిష్కామ్య భక్తి విశేషంతో పరమాత్మను చేరుకోవడం ఎవరికైనా సులభ సాధ్యమవుతుందని తన మూర్తిమత్వం ద్వారా నిరూపించాడు.
- డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?