ప్రాణవిద్య
ప్రాణాన్ని ఆధారంగా చేసుకుని సాగించే దైవాన్వేషణను ప్రాణవిద్య అంటారు. యంత్రాలు విద్యుచ్ఛక్తితో పనిచేస్తాయి. అలాగే విశ్వం అనే మహాయంత్రం దైవశక్తితో నడుస్తోంది. విద్యుచ్ఛక్తి కనపడకపోయినా, ఆ శక్తి కలిగిన తీగలను మనం చూడగలుగుతున్నాం. ...
ప్రాణాన్ని ఆధారంగా చేసుకుని సాగించే దైవాన్వేషణను ప్రాణవిద్య అంటారు. యంత్రాలు విద్యుచ్ఛక్తితో పనిచేస్తాయి. అలాగే విశ్వం అనే మహాయంత్రం దైవశక్తితో నడుస్తోంది. విద్యుచ్ఛక్తి కనపడకపోయినా, ఆ శక్తి కలిగిన తీగలను మనం చూడగలుగుతున్నాం. అలాగే దైవం అగోచరమైనా, దైవశక్తి అయిన ప్రాణాన్ని మాత్రం మనం గుర్తించగలుగుతున్నాం. మన మనుగడకు ఆధారమైన ప్రాణమే దైవమనే సత్యాన్ని తెలుసుకుని, కాలాన్ని ఆయువును దేహాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పెద్దలు మనకు బోధించారు. నిర్గుణదైవాన్ని పరమాత్మ అని, సగుణస్వరూపాన్ని ప్రాణమని వేదం అంటుంది. పరమాత్మను సూచించేందుకు ప్రాణశబ్దాన్ని వాడటం శాస్త్ర సమ్మతమంటారు పెద్దలు. ఆత్మ నీడగా, ఆత్మ ప్రతినిధిగా, ఆత్మ ప్రకాశంగా దీన్ని అభివర్ణించారు.
కాంతికిరణాలు అంతటా ప్రసరిస్తున్నా, వస్తువుపై పడితేగాని ప్రకాశించవు. అలాగే దైవం సర్వవ్యాపకుడైనా, ప్రాణశక్తి అనేదే లేకపోతే, ఆ దైవాన్ని ప్రతిబింబించే మాధ్యమం ఉండనందువల్ల ప్రకటితం కాడు. సర్వవ్యాపకమైన దైవశక్తి మనం పూజించే విగ్రహాల్లోను యంత్రాల్లోను కలశాల్లోను ప్రతిబింబించాలంటే, వీటిలో ముందుగా ప్రాణాన్ని ప్రతిష్ఠించాలన్నది ఆగమశాస్త్ర నియమం. ఆలయమూర్తులకు దైవశక్తిని ధారపోసే ఈ వైదిక ప్రక్రియను ప్రాణప్రతిష్ఠ అంటారు. ప్రశ్నోపనిషత్తు ప్రాణశక్తిని ఇలా కీర్తించింది- ‘సూర్యుడై ప్రకాశిస్తుంది, అగ్నిగా మండుతుంది, మేఘమై వర్షిస్తుంది, ఇంద్రుడిగా పాలిస్తుంది, చంద్రుడిగా పోషిస్తుంది, విశ్వానికి ప్రభువై లోకాలను ఏలుతుంది, చలించని పరమాత్మను ఆధారంగా చేసుకుని చలించే లోకాలను సృజిస్తుంది, సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహిస్తుంది, పంచభూతాలకు శ్రద్ధ మనసు ఇంద్రియాలకు జన్మనిస్తుంది’. విశ్వపాలనకు వీలుగా ప్రాణశక్తి తనను తాను, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమనే విభాగాలుగా చేసుకుంటుంది. ఇందులో మొదటిదైన మూలప్రాణం, సూర్యుడై విశ్వాన్నంతా నడుపుతుంది. మేఘమై వర్షించి, భూమిని సారవంతం చేసి, అన్నంగా రూపొంది, పురుషుడి రేతస్సుగా స్త్రీ గర్భాన ప్రవేశించి, దేహాన్ని దాలుస్తుంది. భూమిని స్థిరకక్ష్యలో ఉంచి సమస్థితిని కలిగించేది అపానమని, వాయువై విశ్వమంతా వ్యాపించేది వ్యానమని, అగ్నితత్వమే ఉదానమని, భూమి ఆకాశాల మధ్య సంచరిస్తూ నక్షత్ర గ్రహగతులను నియంత్రించేది సమానమని శాస్త్రాలు చెబుతాయి.
మనిషిలో వ్యష్టి ప్రాణంగా, ప్రకృతిలో సమష్టి ప్రాణంగా ఉండే ఈ మహాప్రాణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రాణవిద్య మనకు బోధిస్తుంది. అన్నమే ప్రాణమని తెలుసుకుని, ప్రాణాయస్వాహా, అపానాయస్వాహా.... అనే పంచప్రాణాహుతులతోనే అన్నాన్ని దైవానికి నివేదించాలని, తానూ భుజించాలని చెబుతుంది. జీవులను కాచే భూమిని నీటిని పరిశుభ్రంగా ఉంచమని, ప్రాణవాయువును అందించే వృక్షాలను పరిరక్షించమని అంటుంది. సర్వజీవుల్లోని ప్రాణమే దైవమని గ్రహించి, జీవహింసలకు పాల్పడరాదని హెచ్చరించింది. ఈ ప్రాణవిద్యను శ్రద్ధగా ఆచరించే వ్యక్తికి, ఆత్మవిద్య సహజంగానే సిద్ధిస్తుంది.
- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు.
తాజా వార్తలు (Latest News)
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!