అసలైన ఆస్తిపాస్తులు
వీరుడైన ఒక రాజు శత్రురాజ్యాలను జయించి వారి సంపదలను కొల్లగొట్టి తనవిగా చేసుకొన్నాడు. విజయగర్వంతో విర్రవీగాడు. తన ఉన్నతికి తన శక్తిసామర్థ్యాలే తప్ప లక్ష్మీకటాక్షం కారణం కాదని లక్ష్మిని
వీరుడైన ఒక రాజు శత్రురాజ్యాలను జయించి వారి సంపదలను కొల్లగొట్టి తనవిగా చేసుకొన్నాడు. విజయగర్వంతో విర్రవీగాడు. తన ఉన్నతికి తన శక్తిసామర్థ్యాలే తప్ప లక్ష్మీకటాక్షం కారణం కాదని లక్ష్మిని అవమానించాడు. కోపించిన అష్టలక్ష్మి తన స్వరూపాలనుంచి ఒక్కొక్కటిగా దూరమైంది. ఏడుగురు లక్ష్ములు మాయమయ్యేసరికి రాజుకు రకరకాల బాధలు ఎదురయ్యాయి. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. చివరగా వెళ్ళిపోతున్న ధైర్యలక్ష్మి పాదాలపై పడి క్షమను అర్థించాడు. మనిషి ఏ సంపదను పోగొట్టుకొన్నా తిరిగి పొందవచ్చు గానీ ధైర్యాన్ని దూరం చేసుకొంటే జీవితమే లేదని వెళ్లవద్దని ప్రార్థించాడు. జాలిపడిన లక్ష్మి ఇతర స్వరూపాలతో అతనింట మళ్ళీ కొలువుతీరింది. మనోధైర్యం కోల్పోయిన మనిషి ప్రాణం లేని బొందితో సమానం. కొద్దిపాటి ధైర్యంనుంచి ప్రాణాలకు తెగించే సాహసం వరకు మనిషిని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. పిల్లల్ని దారికి తెచ్చేందుకు చీకటిని, బూచిని చూపించి భయపెడతారు తల్లిదండ్రులు. పిరికితనంతో పెరిగినవారు సమాజానికి ఉపయోగపడకపోగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు.
పిల్లల పాలనలో పోషణలో కన్నవారి ఆలోచనలు స్థిరంగా ఉండాలి. పెంపకంలో ఇద్దరి పాత్రలు సమానమే అయినా ఆడపిల్లకు అమ్మ తక్షణ రక్షణ. గురువు, స్నేహితురాలు, మార్గదర్శి, అబల, అనుమానం, అజ్ఞానం, అనవసర భయాలు అనే గోడల్ని కూల్చి అమ్మాయిలు ధైర్యంగా పెరగాలి. పిరికితనంతో ఎదిగితే బతుకు భయంగా మారుతుంది. యౌవనం ఓ కీలక దశ. శరీరంలో, మనసులో వచ్చే మార్పుల్ని అర్థం చేసుకునే స్థాయికి చేరుకొంటారు. సమాజంలో తమ స్థానమేమిటో స్పష్టంగా అర్థమవుతుంది. ఆటపాటల్లో, చదువుసంధ్యల్లో ముందుకు దూసుకువెళతారు. ఎంతటి కష్టంలోనైనా కన్నీటిబొట్టు నేల రాల్చక నిలిచే ధీమంతులవుతారు. సుఖాల పల్లకిలో ఊరేగించక కష్టాల కడలిని కూడా చూపించాలి. పరిస్థితుల్ని ఢీ కొట్టి ఒంటరితనంలో ఓరిమితో నిలిచే పాఠాలు బోధించాలి. ప్రలోభాలకు లొంగకుండా విద్యల్లో రాణించేలా తీర్చిదిద్దాలి. కబళించే మేకవన్నె పులుల నుంచి తమను తాము కాపాడుకొనేలా తర్ఫీదునందించాలి. వివేకంతో లోకాన్ని చదివే తెలివిని నేర్పాలి. పిల్లల ప్రవర్తనలో ఊహించని మార్పులొస్తే పసిగట్టి లాలనతో చేరదీసి సమస్యను సహనంతో పరిష్కరించాలి. స్నేహాల హద్దుల్ని నియంత్రించి నిఘానేత్రంతో అనుక్షణం వారిని గమనించాలి.
ఒంటరి అంకె లాంటిది ఆడపిల్ల.తోడుగా పక్కన చక్కని మరో అంకెను చేర్చి ఆమె జీవితం పరిపూర్ణమయ్యేలా చేసేది అమ్మానాన్నలే. కారుచీకట్లో ఎన్నో భయాలు, సంశయాలు. చిరుమెరుపు ఆ చీకటిని చీల్చి వెలుగురేఖ నింపినట్లు లేత బతుకులకు అమ్మ తోడూనీడై నిలిస్తే- వారి బతుకులు బంగరుమయమే. క్షణికావేశంలో పిరికితనంతో ఎవరూ జీవితాన్ని అంతం చేసుకోకూడదు. సమస్యకు బలమైన ఆలోచనే పరిష్కారం. తల్లిదండ్రులు బిడ్డలకు ఇవ్వవలసిన ఆస్తులు- మేడలు మిద్దెలు, నగలు నాణ్యాలు, చీరెలు సారెలు కాదు. సమస్యల లోకంలో నిర్భయంగా బతికేందుకు పిడికెడు ధైర్యం, చిటికెడు ఆత్మవిశ్వాసం. అవే వెలకట్టలేని నిజమైన ఆస్తులు. బిడ్డల యోగక్షేమాలు నిరంతరం కాపుగాసి కాపాడితే కన్నవారి జీవితాలు, పిల్లల భవిష్యత్తు స్వర్గతుల్యమవుతాయి.
- మాడుగుల రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM