గరుడ చరిత్ర
సభ ప్రారంభంలో సభాసదులకు ఆహ్వానం పలికే సందర్భంలో ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అనడం రివాజుగా కనబడుతున్నది. ఇది త్యాగరాజు కీర్తన. నారదాదులను మహాత్ములుగా పేర్కొన్నారు త్యాగరాజు. ఆ వరసలోనే గరుత్మంతులవారు వస్తారు.
సభ ప్రారంభంలో సభాసదులకు ఆహ్వానం పలికే సందర్భంలో ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అనడం రివాజుగా కనబడుతున్నది. ఇది త్యాగరాజు కీర్తన. నారదాదులను మహాత్ములుగా పేర్కొన్నారు త్యాగరాజు. ఆ వరసలోనే గరుత్మంతులవారు వస్తారు. గరుత్మంతుడి మాతృభక్తి లోకానికి గొప్ప ఆదర్శం. అందువల్లనే మనకు పూజనీయుడయ్యాడు.
గరుత్మంతుడు సర్వ ఉత్తమ గుణాలకు ఆలవాలం. అతడి పవిత్ర చరిత్రను మననం చేసుకున్నవారికి ఉత్తమ గుణశీలాలు అలవడతాయని నమ్మకం. విష్ణుదేవాలయాల్లో గరుత్మంతుడి పూజ ఉంటుంది. వేణుగోపాలస్వామి ఆలయంలో గరుడస్తంభం పూజలందుకుంటుంది. స్వామి విగ్రహానికి ఎదురుగా గరుడస్తంభాన్ని నిలుపుతారు. విష్ణువు గరుడధ్వజుడు. శ్రావణ శుద్ధ పౌర్ణమిని గరుడపంచమిగా కొందరు పాటిస్తారు. ఆదిశేషుడి బొమ్మకింద గౌరీదేవిని పెట్టి పూజ చేయడం సంప్రదాయం. పుట్టను పూజించే ఈ పద్ధతిని గరుడపంచమి వ్రతం అంటారు.
గరుత్మంతుడికి అంతటి ప్రాధాన్యం లభించడానికి కారణం- ఆయన లోకహితైక దృష్టి.
గరుత్మంతుడు పుట్టుకతోనే అమిత బలశాలి. తల్లి వినత- ఆమె అక్క అయిన కద్రువ వద్ద దాసిగా ఉండవలసి వచ్చింది. పెద్దతల్లి ఆజ్ఞవల్ల గరుత్మంతుడు కద్రువ కుమారులైన సర్పాలను వీపుపై మోయవలసి వచ్చింది. తనకు ఎంత బలపరాక్రమాలున్నా ధర్మాన్ని వీడకూడదు. తల్లిని దాస్య విముక్తురాలిని చేయడం తన ముఖ్య కర్తవ్యం!
‘మా అమ్మకు ఈ దాస్యం నుంచి విముక్తి లభించాలంటే ఏం చేయాలి?’ అని సూటిగా కద్రువ కుమారులనే అడిగాడు గరుత్మంతుడు. ‘అమృతం తెచ్చి ఇస్తే... మీ అమ్మకు దాస్యవిముక్తి కలుగుతుంది’ అని సర్పాలు సమాధానమిచ్చాయి. మరుక్షణమే గరుత్మంతుడు అమృతాన్ని సంపాదించి తేవడానికి బయలుదేరాడు. అనేక ఇబ్బందులు తలెత్తాయి. వాటినన్నింటినీ అవలీలగా అధిగమించాడు. గజ, కచ్ఛపాలను రెండు చేతుల్లో ఇరికించుకున్నాడు. వాటితో ఒక వృక్షంపై వాలాడు. ఆ చెట్టు పేరు రోహిణం. ఆ బరువుకు రోహిణం కొమ్మ విరిగిపోయింది. ఆ చెట్టు కొమ్మను ఆధారం చేసుకొని వాలఖిల్యులనే మునులు తపస్సు చేసుకుంటున్నారు. గరుత్మంతుడు వాలఖిల్యులు గాయపడకుండా జాగ్రత్తపడ్డాడు.
అమృత సాధన సులభం కాదు. గరుత్మంతుడు తన బలాన్ని సరైన సమయానికి ఉపయోగించాడు. సాధించాడు. అమృతాన్ని స్వార్థానికి ఉపయోగించుకోలేదు. అతడి కార్యదీక్షకు విష్ణువు సైతం సంతోషించాడు. గరుత్మంతుడికి ప్రత్యక్షమయ్యాడు.
‘వరం కోరుకో ప్రసాదిస్తా’ అన్నాడు స్వామి వాత్సల్యంతో.
‘స్వామీ! ఎల్లప్పుడూ మీ సమక్షంలోనే, మీ ముందు ఉంటూ, సదా మిమ్మల్ని సేవించుకొనే వరం అజరామరత్వం ప్రసాదించండి’ అని వేడుకున్నాడు గరుత్మంతుడు. స్వామి అనుగ్రహించాడు. విష్ణువుకు ధ్వజంపై చిహ్నంగా గరుత్మంతుడు నిలిచాడు. విష్ణువు తనకు తానే గరుత్మంతుడిని సారథిగా ఎన్నుకున్నాడు. ఈ విధంగా తన ఆదర్శ పవిత్ర జీవన విధానంలో గరుడ ఆళ్వారుగా పూజలందుతున్నాడు!
- డాక్టర్ పులిచెర్ల సాంబశివరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు